భీమ్లా నాయక్ - ఫిబ్రవరి | టాలీవుడ్ బాక్సాఫీస్కు ఫిబ్రవరి డల్ సీజన్ అనే చెప్పాలి. ముఖ్యంగా పరీక్షల సీజన్ కావడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సంకోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అన్ సీజన్లో మహా శివరాత్రి కానుకగా ‘భీమ్లా నాయక్’ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే సాధిస్తోంది. అంతేకాదు గతంతో పోల్చకుంటే ఫిబ్రవరి నెలలో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా ‘భీమ్లా నాయక్’ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 52.46 కోట్ల షేర్.. (రూ. 81.50 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఫుల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి. ఇక మిగతా నెలల్లో హైయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
జనవరి | ‘అల వైకుంఠపురములో’ | ఒకప్పటితో పోల్చుకుంటే.. సినిమా టికెట్స్ రేట్స్లో పెరుగుదల కారణంగా ప్రతి యేడాది ఈ ర్యాంక్స్ ఛేంజ్ అవుతూ ఉంటాయి. ఇక 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన త్రివిక్రమ్, అల్లు అర్జున్ల ‘అల వైకుంఠపురములో’ సినిమా.. ఓవరాల్గా ఈ చిత్రం రూ. 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2020లో హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు జనవరి నెలలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
మార్చి | రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. హీరో: రామ్ చరణ్, దర్శకుడు: సుకుమార్, ఫస్ట్ వీక్ ఏపీ తెలంగాణ షేర్: రూ. 58.98 కోట్లు షేర్ సాధించింది. ఓవరాల్గా రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది. 2018లో హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు మార్చిలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను రాబోయే ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు బీట్ అవకాశాలున్నాయి. ఒక రకంగా మార్చి కూడా విద్యార్ధులకు పరీక్ష సీజన్ కాబట్టి ఒకింత రిస్క్ సమయమనే చెప్పాలి. (Twitter/Photo)
ఏప్రిల్ - బాహుబలి 2 | 2017లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం దాదాపు రూ 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 325 కోట్ల షేర్ సాధించింది. మిగతా అన్ని భాషల్లో కలిపి రూ. 831 కోట్ల షేర్ సాధించింది. 2017 హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇప్పటి వరకు ఏప్రిల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. (Twitter/Photo)
మే - మహర్షి | 2019 మే 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25 సినిమాగా వచ్చిన మహర్షి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు. ఈ సినిమా ఇప్పటి వరకు మే నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన టాలీవుడ్ సినిమాగా నిలిచింది. త్వరలో ఈ సినిమాను బీట్ చేసే మూవీలు వస్తే ఈ సినిమా అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
జూలై - బాహుబలి | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా దాదాపు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను అన్ని భాషల్లో కలిసి సాధించింది. తెలుగులో రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్గా రూ. 311 కోట్ల షేర్ సాధించి 2015 హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు జూలై నెలలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
ఆగష్టు - సాహో | 2019 - సాహో | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ. 218.45 కోట్ల వసూళ్ల షేర్ సాధించింది. తెలుగులోఈ మూవీ రూ. 90 కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీకి హిందీలో మంచి వసూళ్లు దక్కడం విశేషం. 2019లో హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు ఆగష్టు నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
సెప్టెంబర్ - జనతా గ్యారేజ్ | ఎన్టీఆర్ హీరోగా మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ మూవీ ఓవరాల్గా రూ. 80.05 కోట్ల షేర్ సాధించి 2016 హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసుకుంది. (Twitter/Photo)
అక్టోబర్ సైరా నరసింహా రెడ్డి | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సురేందర్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో కలిపి రూ. 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అక్టోబర్లో రిలీజైన మూవీస్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
నవంబర్ - డమరుకం | నాగార్జున హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. కానీ ఓవరాల్గా రూ. 36 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. నవంబర్లో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
డిసెంబర్ - పుష్ప | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం 2021 యేడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓవరాల్గా రూ. 145 కోట్లకు పైగా షేర్ సాధించి 2021లో హైయ్యెస్ట్ గ్రాసర్గా నిలవడంతోపాటు డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్గా తన పేరిట రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)