Top 10 Highest Gross Indian Movies : బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అది చేసి చూపించాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాంటిది ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి బాహుబలి తెరకెక్కించిన తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. 10 రోజుల్లో రూ. 900 కోట్ల క్లబ్బులో చేరింది. త్వరలో రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించే అవకాశాలున్నాయి. మరి భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం..
2.బాహుబలి 2: ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈమె సంచలన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది. కానీ మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే.. ఇప్పటికే బాహుబలి 2 టాప్లో ఉంది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది.
5.సీక్రెట్ సూపర్ స్టార్: అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేసిన ఈ సినిమా ఇండియాలో కేవలం 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది కానీ చైనాలో ఈ సినిమా 800 కోట్లకు పైగా వసూలు చేసింది. అద్వైత్ చందన్ తెరకెక్కించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాను అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్లో నిర్మించాడు. ఈ సినిమా 2017లో విడుదలైంది రూ. 831 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది సీక్రెట్ సూపర్ స్టార్.
16. అంధాదున్ | టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించని సినిమా ‘అంధాదున్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 410 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తెలుగులో నితిన్, తమన్నా ప్రధాన పాత్రలో ‘మ్యాస్ట్రో’గా రీమేక్ చేసారు. (Twitter/Photo)
19. సింబా.. | రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘సింబా’. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ మూవీకి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 385 కోట్లు వసూళు చేసింది 19వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
20. కబీర్ సింగ్.. | షాహిత్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కబీర్ సింగ్’. ఈ సినిమా తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీకి రీమేక్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లు వసూళు చేసింది.ఈ సినిమా 20వ స్థానంలో నిలిచింది. (File/Photo)