తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు గోల్డెన్ లెగ్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా కృతి శెట్టి మాత్రమే. ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా రాని ఇమేజ్ మూడు సినిమాలతోనే తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఉప్పెన సమయంలో తనకు ఎదురైన సంఘటనల గురించి గుర్తు చేసుకుంది కృతి శెట్టి. ముఖ్యంగా అప్పట్లో ఓ హీరో తనకు రాసిన లెటర్ గురించి.. తనకు నచ్చిన హీరో గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఉప్పెనలో ముందు మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని ఎందుకో మనసు కుదరక కృతి వైపు వచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా 51 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఉప్పెన. ఇప్పటి వరకు ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన వసూళ్ల ఉప్పెన కురిపించింది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తెలియదు కానీ కృతి మాత్రం పాపులర్ అయిపోయింది.
ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా కాదు.. దానికి మించి అందుకుంది కృతి. ఈమె కోసం ఇప్పుడు హీరోలు వేచి చూస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కోట్లు కురిపిస్తున్నారు. దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ఉప్పెన విడుదలకు ముందే ఇండస్ట్రీలో కృతి గురించి చర్చలు మొదలయ్యాయి. ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీసారు. ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు.
ఒక్కసారి ఉప్పెన విడుదలైతే ఈ అమ్మాయి మీకు దొరకమంటే కూడా దొరకదు.. ఇప్పుడే బుక్ చేసుకోండి అంటూ చెప్పాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతుంది. అయితే ఉప్పెన సినిమా విడుదలైన తర్వాత ఈమెకు చిరంజీవి ఓ లెటర్ రాసాడు. అందులో యు ఆర్ బార్న్ స్టార్ అని రాసి ఉంది. పుట్టుకతోనే నువ్వు స్టార్ అని దాని అర్థం. దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంది ఉప్పెన బ్యూటీ.
ఈ సినిమా తర్వాత మరో రెండు విజయాలు అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది కృతి శెట్టి. నానితో నటించిన శ్యామ్ సింగరాయ్, మొన్న సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలు కూడా విజయం సాధించడంతో కృతి డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయిపోయాయి. చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఆమెను సంప్రదించే కంటే ముందుగానే ఆమె రేట్ తెలిసి షాక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు.
ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోటి 25 కావాలంటుంది. అయితే అంతకు ముందు కమిటైన సినిమాలకు మాత్రం తక్కువగానే తీసుకుంటుంది కృతి. ఈమె వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. వరసగా మూడు విజయాలు రావడంతో కృతి శెట్టి టాప్ రేంజ్కు వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈమె నితిన్ మాచర్ల నియోజకవర్గం.. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రామ్ లింగుస్వామి సినిమాలతో బిజీగా ఉంది. వాటితో పాటు ఇప్పుడు ఒప్పుకునే సినిమాలకు 1.25 కోట్లు కావాలంటుంది కృతి. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత ఈమెకు ఎంతైనా ఇవ్వొచ్చులే అనుకుంటున్నారు నిర్మాతలు. పైగా ఇప్పుడు లిప్ లాక్ సీన్స్.. బెడ్రూమ్ సీన్స్ కూడా చేస్తుంది కృతి.
మరోవైపు తనకు చిరంజీవి రాసిన లెటర్ ఎంత నచ్చిందో.. రామ్ చరణ్ కూడా అంతే నచ్చుతాడని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ తనను ప్రత్యేకంగా అభినందించాడని.. అది ఎప్పటికీ మరిచిపోలేనంటుంది కృతి. మరోవైపు చిరంజీవి కూడా తనను ఎంతో ఎంకరేజ్ చేసారని గుర్తు చేసుకుంది కృతి శెట్టి.