‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అంతకు ముందు ఈయన 7 చిత్రాలను డైరెక్ట్ చేసినా.. రాని గుర్తింపు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో వచ్చింది. ఈ సినిమాను 90వ దశకంలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో హిందూ పండిత్స్ పై జరిగిన దారుణ మారణకాండను కళ్లకు కట్టనట్టు చూపించారు. (Twitter/Photo)
కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. (File/Photo)
కరోనా ఉదృతి సమయంలో మన దేశం కరోనా వాక్సిన్ను కనుగొనడంతో పాటు అందరికీ సరైన సమయంలో అందుబాటులోకి తీసుకోవడంతో మన దేశం బతికి బట్టకట్టింది. అంతేకాదు మన దేశంలో తయారైన వాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసారు.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను మన దేశ శాస్త్రజ్ఞులతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో అభినందించాలి.
మొత్తంగా ఈ వాక్సిన్ తయారు చేసినా.. మార్కెట్లోకి రాకుండా అంతర్జాతీయంగా జరిగిన కుట్రలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. మరోవైపు మన దేశంలో వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ఇతర రాజకీయ పక్షాలు చేసిన నానా యాగీని కూడా ఇందులో చూపించే అవకాశాలున్నాయి. మొత్తంగా వ్యాక్సిన్ పై ప్రజల్లో చేసిన దుష్ప్రచారాన్నిసైతం తట్టుకొని ప్రజలు స్వచ్ఛదంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో పాటు మొత్తంగా 11 భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
’ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (Twitter/Photo)
గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ను అభినందించారు.అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని, హోం మంత్రి చిత్ర దర్శక, నిర్మాతలను అభినందించిన విషయం తెలిసిందే కదా. అంతేకాదు ఈ సినిమా చూడమంటూ ప్రజలకు పిలుపు నివ్వడం కూడా ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ ఏర్పడేలా చేసింది. ప్రధాని ఈ సినిమాను ప్రశంసిండంతో ఈ సినిమా చూడటానికి కామన్ ఆడియన్స్ సహా చాలా మంది థియేటర్స్కు క్యూ కట్టారు. (Twitter/Photo)
థియేటర్స్కు వెళ్లిన ఆడియన్స్కు అక్కడ సినిమా కంటే కూడా కశ్మీర్ కథ, కన్నీటి వ్యధ కనిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినపుడు అపుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.. కశ్మీర్లో జరిగిన పండిట్స్ మారణహోమం నిజంగా అంత దారుణంగా సాగిందా..? వీటన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ అంటే భారత్లో భాగం కాదేమో అనే ప్రశ్నలు ఈ సినిమా చూస్తే తలెత్తుతాయంటున్నారు ప్రేక్షకులు. 1990ల్లో కశ్మీర్ పండిట్స్ను చంపిన ఉదంతాలు ఇప్పటికే చాలాసార్లు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా వచ్చాయి. అయితే ‘కశ్మీర్ ఫైల్స్’ మాత్రం పచ్చిగా తీసిన నిజం అంటున్నారు ప్రేక్షకులు విశ్లేషకులు. (Twitter/Photo)
ఈ కశ్మీర్ ఫైల్స్ చూసిన కశ్మీర్ పండిత్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బులు మాత్రమే కాదు.. ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే చరిత్రలో ఏం ఉందో.. ఎవరిది తప్పుందో ఎవరూ చెప్పరు.. ఏదైనా ఓ సైడ్ తీసుకుని సినిమా చేయాల్సిందే. వివేక్ అగ్నిహోత్రి మాత్రం చాలా వరకు నిజాలే సినిమాలో చూపించాడని అప్పటి పండిట్స్ కూడా చెప్పిన మాట. అందుకే ఈ చిత్రానికి ఇంతగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. (Twitter/Photo)
కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురిపించింది. ఈ సినిమా నేటి నుంచి జీ 5లో హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్లో ఈ సినిమా వీక్షించని ప్రేక్షకులు ఎంచక్కా ఓటీటీ వేదికగా ఈ సినిమా చూడొచ్చు.
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీలో అనుపమ్ ఖేర్ నటన సినిమాకు హైలైట్.. మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి.. అంతా ప్రాణం పెట్టి నటించారు.. ఓవరాల్గా కాశ్మీర్ ఫైల్స్.. కేవలం సినిమా మాత్రమే కాదు.. మరుగున పడిపోయిన చరిత్రకు దృశ్యరూపం కూడా అనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు ప్రశంసలతో పాటు వివాదం కూడా చుట్టుముడుతుంది. మొత్తంగా 2022లో బాలీవుడ్ కాదు.. కాదు.. మన దేశంలోనే పెట్టిన పెట్టుబడితో పోలిస్తే.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. (Twitter/Photo)