The Kashmir Files : కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ టీమ్ మెంబర్స్. గత కొన్ని రోజులుగా ఏ ఇద్దరు కలిసిన.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చిత్ర యూనిట్ను అభినందించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సినిమా లో సత్యాన్ని ఎంతో నిర్భయంగా చెప్పిన తీరును అభినందించారు. చరిత్రలో జరిగిన ఈ సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ఈ సినిమా ఉపయోగపడుతోందన్నారు. అప్పట్లో కశ్మీర్ జరిగిన దారుణ మారుణ కాండను దర్శకుడు ఎంతో నిర్భీతితో తెరకెక్కించారన్నారు. ఇలాంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన దర్శక, నిర్మాతలకు హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. (Twitter/Photo)
ఈ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా ‘కశ్మీర్ ఫైల్స్’ టీమ్ మెంబర్స్ తన అధికార నివాసంలో పిలిచి వారిని అభినందించారు. (Twitter/Photo)
ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎవరేమన్నా.. ది కాశ్మీర్ ఫైల్ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురుస్తుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (Twitter/Photo)
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిత్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు సమాచారం. ముష్కర దాడుల కారణంగా కశ్మీర్ పండితులను వారి స్వస్థలాల నుంచి తరిమి కొడితే.. పుట్ట కొకరు.. చెట్టుకొకరు అవుతారు.ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. (Twitter/Photo)
నరేంద్ర మోదీ ప్రశంసల ఝల్లు,ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు పొందిన ది కశ్మీర్ ఫైల్స్" width="1600" height="1600" /> గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ను అభినందించారు.అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్లో విడుదలైంది. ఓవర్సీస్లో 113 స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలై సంచల విజయం దిశగా దూసుకుపోతోంది. (Twitter/Photo)
థియేటర్స్కు వెళ్లిన ఆడియన్స్కు అక్కడ సినిమా కంటే కూడా కశ్మీర్ కథ, కన్నీటి వ్యధ కనిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినపుడు అపుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.. కశ్మీర్లో జరిగిన పండిట్స్ మారణహోమం నిజంగా అంత దారుణంగా సాగిందా..? వీటన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ అంటే భారత్లో భాగం కాదేమో అనే ప్రశ్నలు ఈ సినిమా చూస్తే తలెత్తుతాయంటున్నారు ప్రేక్షకులు. 1990ల్లో కశ్మీర్ పండిట్స్ను చంపిన ఉదంతాలు ఇప్పటికే చాలాసార్లు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా వచ్చాయి. అయితే కాశ్మీర్ ఫైల్స్ మాత్రం పచ్చిగా తీసిన నిజం అంటున్నారు ప్రేక్షకులు విశ్లేషకులు. (Twitter/Photo)
ఈ కశ్మీర్ ఫైల్స్ చూసిన కశ్మీర్ పండిత్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బులు మాత్రమే కాదు.. ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే చరిత్రలో ఏం ఉందో.. ఎవరిది తప్పుందో ఎవరూ చెప్పరు.. ఏదైనా ఓ సైడ్ తీసుకుని సినిమా చేయాల్సిందే. వివేక్ అగ్నిహోత్రి మాత్రం చాలా వరకు నిజాలే సినిమాలో చూపించాడని అప్పటి పండిట్స్ కూడా చెప్తున్న మాట. అందుకే ఈ చిత్రానికి ఇంతగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. (Twitter/Photo)
కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురుస్తోంది. మొదటి రోజు కేవలం 3.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టిస్తుంది. రెండో రోజు 8.50 కోట్లు.. మూడో రోజు 15.50 కోట్లు.. నాలుగో రోజు 15.05 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజు రూ. 18.02 కోట్లు వసూళు చేసింది. ఇప్పటి వరకు రూ. 60.22 కోట్లు వసూళ్లు చేసింది. త్వరలో రూ. 100 కోట్లకు పై బడి వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి.
అనుపమ్ ఖేర్ నటన సినిమాకు హైలైట్.. మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి.. అంతా ప్రాణం పెట్టి నటించారు.. ఓవరాల్గా కాశ్మీర్ ఫైల్స్.. కేవలం సినిమా మాత్రమే కాదు.. మరుగున పడిపోయిన చరిత్రకు దృశ్యరూపం కూడా అనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు ప్రశంసలతో పాటు వివాదం కూడా చుట్టుముడుతుంది. మొత్తంగా 2022లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమా దూసుకుపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. (Twitter/Photo)