The Kashmir Files : ‘’ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమాకు రోజు రోజుకు పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది.
మొదటి వారం ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్లో విడుదలైంది. ఓవర్సీస్లో 113 స్క్రీన్స్లో మొత్తంగా 674 స్క్రీన్స్లో విడులైన ఈ సినిమా.. రెండో వారం వచ్చేసరికి 6 రెట్లకు పైగా 4000 పైగా స్క్రీన్స్లో ప్రదర్శితమవుతోందంటే ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎపుడో కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతాలు జరగడం రేర్ అనే చెప్పాలి. (Twitter/Photo)
గత కొన్ని దశాబ్దాలుగా థియేటర్స్ ముఖం చూడని వాళ్లi కూడా ఈ సినిమా చూడడానికి టాకీస్లకు క్యూ కడుతున్నారంటే ఈ సినిమా ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఈ సినిమాపై భిన్నాప్రాయాలు వ్యక్తమవుతోన్న మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ‘ది కశ్మర్ ఫైల్స్’ ప్రభంజనం ఆగడం లేదు. ఈ సినిమాకు దెబ్బకు ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో పాటు అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’కు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. (Twitter/Photo)
ఈ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా ‘కశ్మీర్ ఫైల్స్’ టీమ్ మెంబర్స్ తన అధికార నివాసంలో పిలిచి వారిని అభినందించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎవరేమన్నా.. ది కాశ్మీర్ ఫైల్ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (Twitter/Photo)
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిత్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మారణ కాండకు కేంద్రంలో ఉన్న మంత్రి తో అప్పపటి ముఖ్య మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు చూపించారు. ముష్కర దాడుల కారణంగా కశ్మీర్ పండితులను వారి స్వస్థలాల నుంచి తరిమి కొడితే.. పుట్ట కొకరు.. చెట్టుకొకరు అవుతారు.ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. (Twitter/Photo)
గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ను అభినందించారు.అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.అంతేకాదు ఈ సినిమా చూడమంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రధాని ఈ సినిమాను ప్రశంసిండంతో ఈ సినిమా చూడటానికి అందరు థియేటర్స్కు క్యూ కడుతున్నారు. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. (Twitter/Photo)
థియేటర్స్కు వెళ్లిన ఆడియన్స్కు అక్కడ సినిమా కంటే కూడా కశ్మీర్ కథ, కన్నీటి వ్యధ కనిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినపుడు అపుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.. కశ్మీర్లో జరిగిన పండిట్స్ మారణహోమం నిజంగా అంత దారుణంగా సాగిందా..? వీటన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ అంటే భారత్లో భాగం కాదేమో అనే ప్రశ్నలు ఈ సినిమా చూస్తే తలెత్తుతాయంటున్నారు ప్రేక్షకులు. 1990ల్లో కశ్మీర్ పండిట్స్ను చంపిన ఉదంతాలు ఇప్పటికే చాలాసార్లు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా వచ్చాయి. అయితే కాశ్మీర్ ఫైల్స్ మాత్రం పచ్చిగా తీసిన నిజం అంటున్నారు ప్రేక్షకులు విశ్లేషకులు. (Twitter/Photo)
ఈ కశ్మీర్ ఫైల్స్ చూసిన కశ్మీర్ పండిత్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బులు మాత్రమే కాదు.. ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే చరిత్రలో ఏం ఉందో.. ఎవరిది తప్పుందో ఎవరూ చెప్పరు.. ఏదైనా ఓ సైడ్ తీసుకుని సినిమా చేయాల్సిందే. వివేక్ అగ్నిహోత్రి మాత్రం చాలా వరకు నిజాలే సినిమాలో చూపించాడని అప్పటి పండిట్స్ కూడా చెప్తున్న మాట. అందుకే ఈ చిత్రానికి ఇంతగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. (Twitter/Photo)
ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ప్రకటించాయి. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సినిమ ా కోసం హాఫ్ డే లీవ్ కూడా మంజూరు చేయడం విశేషం. చాలా యేళ్ల తర్వాత బాలీవుడ్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. (Twitter/Photo)
కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురుస్తోంది. మొక మొదటి రోజు కేవలం రూ. 3.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టిస్తుంది. రెండో రోజు 8.50 కోట్లు.. మూడో రోజు 15.50 కోట్లు.. నాలుగో రోజు 15.05 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజు రూ. 18.02, ఆరో రోజు రూ. 19.05 కోట్లు.. ఏడో రోజు.. ఈ సినిమా రూ. 18.05 కోట్లు.. ఎనిమిదో రోజు హోళి పండగ నాడు.. రూ. 19.15 కోట్లు వసూళు చేసింది. మొత్తంగా 8 రోజుల్లో 116.45 కోట్లు వసూళు చేసింది. త్వరలో రూ. 150 కోట్లకు పై బడి రూ. 200 కోట్లను వచ్చే వారం వరకు క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అనుపమ్ ఖేర్ నటన సినిమాకు హైలైట్.. మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి.. అంతా ప్రాణం పెట్టి నటించారు.. ఓవరాల్గా కాశ్మీర్ ఫైల్స్.. కేవలం సినిమా మాత్రమే కాదు.. మరుగున పడిపోయిన చరిత్రకు దృశ్యరూపం కూడా అనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు ప్రశంసలతో పాటు వివాదం కూడా చుట్టుముడుతుంది. మొత్తంగా 2022లో బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు ట్రేడ్ పండితులు. (Twitter/Photo)