దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్లను సైతం గెలుచుకుంటోంది. Photo : Twitter
ఇక లేటెస్ట్గా ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ అనేక రికార్డులు సృష్టిస్తూ అనేక అవార్డులు అందుకుంటున్న మన ఆర్ ఆర్ ఆర్ జపాన్లో ఊహించని విధంగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అక్కడ నమోదు చేసింది. అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన ఆర్ ఆర్ ఆఱ్ మరో అరుదైన ఫీట్ని సెట్ చేసింది. Photo : Twitter
జపాన్లో 114 కేంద్రాల్లో 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోని మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇంత వరకు ఏ ఇండియన్ చిత్రం ఈ ఫీట్ సాధించలేదని.. జపాన్లో 100 రోజులు ఆడిన మొదటి భారతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిందని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రకటించడమే కాదు, ఓ పోస్టర్ను వదిలింది. అంతేకాదు రాజమౌళి స్వయంగా దీని గురించి ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Photo : Twitter
ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్కు దక్కుతోన్న గౌరవంతో తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పరవశంలో మునిగితేలుతున్నారు. ఇటీవలే రాజమౌళి ప్రఖ్యాత గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్లో పలువురి హాలీవుడ్ దర్శకులను కలిసి మాట్లాడారు. స్టీవెన్ స్పిల్బర్గ్ను కూడా కలిశారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రాజమౌళి అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా కలిశారు. క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ ఫంక్షన్లో రాజమౌళి, జేమ్స్ కామెరూన్ను కలిసి.. ఓ పదినిమిషాలు మాట్లాడారు. Photo : Twitter
ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన ట్వీట్లో తెలిపారు. కామెరూన్ ఆర్ ఆర్ ఆర్ చూశారని.. తన భార్యకూ కూడా చూడమని చెప్పారని.. ఆర్ ఆర్ ఆర్పై కొన్ని విషయాలను విశ్లేషించారని.. ఉప్పోంగిపోతూ తన ట్వీట్లో పేర్కోన్నారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి, జేమ్స్ కామెరూన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 28వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్లో రాజమౌళి RRR ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. Photo : Twitter
ఇక ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టి అబ్బుర పరిచింది. కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter
నెట్ఫ్లిక్స్ కారణంగా.. వెస్ట్రర్న్ ఆడియెన్స్ను తెగ ఆకట్టుకుంటోన్నఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చి.. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ స్వయంగా ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగానే నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది. Photo : Twitter
ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది... అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్. ఇంత తక్కువుగా వస్తాదని ఊహించలేదని అప్ సెట్ అవుతున్నారు ఫ్యాన్స్.. ఫిదా (21.31) సినిమా కంటే తక్కువగా రావడం ఏంటీని భాదపడుతున్నారు. ఇక తెలుగులో హైయ్యేస్ట్ రేటింగ్ సినిమాల విషయానికి వస్తే.. అల వైకుంఠపురములో (29.4), సరిలేరు నీకెవ్వరు, (23.4) బాహుబలి 2 (22.7)ఉన్నాయి. Photo : Twitter
ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు కలిసి నటించిన RRR దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపుగా ఉన్న అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేసింది. ఇక మరోవైపు ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. సౌత్ భాషలకు సంబంధించి జీ5లో.. అటు హిందీకి సంబంధించి నెట్ఫ్లిక్స్లో టాప్’లో ట్రెండ్ అవుతోంది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్,రామ్ చరణ్లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) సినిమా విషయానికి వస్తే.. ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఎట్టకేలకు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి అప్డేట్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడు శివ కొరటాలతో చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించనున్నారు. Photo : Twitter
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. Photo : Twitter
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్లు టాక్. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. Photo : Twitter
ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter