కార్తికేయ2 లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ సిద్దార్థ ( Nikhil Siddhartha ), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న మరో చిత్రం '18 పేజెస్' (18 Pages). రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) కథ అందించారు. ఇక ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలకానుంది. Photo : Twitter
ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. ఈవెంట్కు అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు సుకుమార్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. మొదట రంగస్థలంలో అనుపమనే హీరోయిన్గా అనుకున్నాం.. అందులో భాగంగా ఆడిషన్స్ చేస్తున్నాం.. అయితే ఆమె ఆడిషన్స్లో భయంగా తన తల్లి వైపు చూస్తోంది. దీంతో నాకు భయం వేసి సమంతను హీరోయిన్గా పెట్టుకున్నానట్లు తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి బజ్ వచ్చింది. ట్రైలర్ ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ఇటీవల 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
ఇక సుకుమార్ పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. Photo : Twitter
ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు పుష్ప 2 షూటింగ్ నవంబర్ 13 నుండి ప్రారంభం కానుంది. అంతేకాదు బ్యాంకాక్లో భారీగా వేసిన సెట్స్లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు ఓ 30 రోజుల పాటు షూటింగ్ జరుగునుందని టాక్.. ఈ ముప్పై రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని.. బ్యాంకాక్లోని అక్కడి దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట టీమ్ . Photo : Twitter
అది అలా ఉంటే ‘పుష్ప 2’ సినిమా గురించి మరో కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో హీరోయిన్ కేథరీన్ థెరీసా నటించనుందని టాక్. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఇక మరో కీలకపాత్రలో మనోజ్ బాజ్ పాయ్ నటించనున్నారు. ఆయన ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నారని అంటున్నారు. Photo : Twitter
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 త్వరలో రష్యాలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ వచ్చే డిసెంబర్లో అక్కడ విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారట దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ రష్యా వెళ్తున్నారట. చూడాలి మరి పుష్పకు ఎలాంటీ రెస్పాన్స్ రానుందో.. ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా ఇటీవల జపాన్ విడుదలై మంచి ఆదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే సీక్వెన్స్లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందట. కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని అన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్తో పుష్ప2ను ఓ రేంజ్లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ను బద్దలు కొట్టనుందో.. Photo : Twitter
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ను మెచ్చుకున్నారు. (Twitter/Photo)
పుష్ప 2 డాన్గా ఎలా రూల్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన లుక్ చూస్తుంటే.. అది పుష్ప 2లో డాన్ లుక్గా ఉంది. నోటిలో సిగార్తో కళ్లద్దాలతో స్టైలిష్గా ఉన్న అల్లు అర్జున్ లుక్కు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఏం మేకోవర్ అంటూ అల్లు అర్జున్ను డెడికేషన్ను మెచ్చుకుంటున్నారు. (Twitter/Photo)
హీరోగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్య మూవీ కేరళలోని చాలా థియేటర్లలో 100 రోజులు ఆడింది. బన్ని వచ్చినపుడు ఎవరీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమర్శలు వచ్చాయి. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ అల్లు అర్జున్పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి.ఇపుడ ఏకంగా ఇండియా టుడే ఇంగ్లీష్ కవర్ పేజ్ పై నార్త్లో సత్తా చాటుతున్న హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆర్ఠికల్ రాసే స్థాయికి చేరుకున్నాడు. (Twitter/Photo)
ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ నత అద్భుతమైన స్టార్ డమ్.. సూపర్ పర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు యూత్తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. (Twitter/Photo)
ముఖ్యంగా ఇపుడు నార్త్ బెల్ట్ ప్రాంతాల్లో సౌత్ హీరోల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. బాహుబలితో ప్రభాస్.. కేజీఎఫ్తో యశ్.. అక్కడి ఆడియన్స్కు దగ్గరయ్యారు. ఆ తర్వాత పుష్పలో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్యాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఇపుడు సౌత్ హీరోలే చిత్ర పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప విషయానికొస్తే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఈ సినిమా సక్సెస్తో హీరోగా అల్లు అర్జున్.. నటిగా రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. మొత్తంగా మన హీరోలు తమ యాక్టింగ్తో ఇంట గెలిచి రచ్చ చేసే పనిలో పడ్డారు. (Twitter/Photo)