Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ (Acharya ) సినిమా చేస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ప్రిరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఇక అది అలా ఉంటే చిరంజీవి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారంటూ ఓ టాక్ నడుస్తోంది. Photo : Twitter
అయితే ఈ విషయంలో ఈరోజు క్లారిటీ రానుందని అంటున్నారు. కారణం రాజమౌళి ఆచార్య ప్రిరిలీజ్కు హాజరు కావడమే కాదు. ఇదే ఫంక్షన్లో ఆయన స్వయంగా ఈ సినిమా గురించి ప్రకటించనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో ఓసినిమాను చేయనున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమా ఉంటే ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
ఇక ఆ మధ్య చిరంజీవి, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈవెంట్లో.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ సినిమాపై ఎలాంటీ అప్ డేట్ లేదు.. చూడాలి మరి రాజమౌళి సినిమా ఏమాత్రం మెటీరియలైజ్ అవుతుందో.. Photo : Twitter
చిరంజీవి నటిస్తున్న ఆచార్య విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన (Acharya Trailer) ట్రైలర్ను విడుదల చేసింది టీమ్. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక తాజాగా ఈ ట్రైలర్ 30 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. Photo : Twitter
దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ను పూర్తిగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. Photo : Twitter
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దివ్య వనం ఒకవైపు.. తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్తో ఈ సినిమా ట్రైలర్ ఓపెన్ చేసారు. ఇక్కడుండే ప్రజలు పూజలు పునస్కారాలు చేస్తూ .. కష్టాలు వచ్చినపుడు అమ్మోరు తల్లిపై భారం వేసి బిక్కు బిక్కు మంటూ ఉంటామని భ్రమ పడి ఉండవచ్చు. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది అంటూ బ్యాక్ గ్రౌండ్లో రామ్ చరణ్ ధర్మస్థలి ఎలా అధర్మస్థలి ఎలా అవుతుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ పై ఉండగా.. మిగతాది చిరంజీవిపై ఉంది. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ను (Acharya Prerelease Event) ఏప్రిల్ 23న ఆరు గంటలకు హైదరాబాద్లోని యూసఫ్ గూడలో నిర్వహించనుందని టీమ్ ఓ పోస్టర్ను విడుదల చేసింది టీమ్. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకడు రాజమౌళి చీఫ్ గెస్ట్గా రానున్నారట. ఇక్కడ మరో విషయం ఏమంటే.. (Acharya Prerelease Event) మొదట విజయవాడలో నిర్వహించాలనీ భావించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే ఏమైందో ఏమో ప్రిరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. Photo : Twitter
ఇక ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది టీమ్. భలే భలే బంజారా సాంగ్జను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా.. రామ్ చరణ్కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం. Photo : Twitter
ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Twitter