Prabhas@20Years : రెబల్ స్టార్ ప్రభాస్ 20 యేళ్ల ప్రస్థానంలో ఆకాశమే హద్దుగా సాగింది. అంతేకాదు బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు (11/11/2022) రోజు ప్రభాస్ హీరోగా పుట్టినరోజు. సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం ఈయన హీరోగా నటించిన ‘ఈశ్వర్’ సినిమా థియేటర్స్లో విడుదలైంది. ఈ 20 యేళ్ల ప్రస్థానంలో హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. దేశం గర్వంచదగ్గ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
2004లో వర్షం మూవీతో హీరోగా మొదటి బ్రేక్. ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు ‘రాఘవేంద్ర’ అనే మాస్ సినిమాతో పలకరించినా.. ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. (Twitter/Photo)
20ఏళ్ల కెరీర్లో పందొమ్మిది సినిమాలు చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచారు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా...‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి...‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్. (Twitter/Photo)
తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇక బాహుబలి 2 పార్ట్తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు. (Twitter/Photo)
ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్ చిత్రాలకి, అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా దాటే తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది బాహుబలి చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారుఒక హీరో. ఆ హీరో 'ప్రభాస్', ఆయన నటించిన ఆ సినిమా బాహుబలి. (Twitter/Photo)
ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు, తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. (Twitter/Photo)
నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ఈశ్వర్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టి వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధిస్తూ ప్రభాస్ 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు. అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. (Twitter/Photo)
20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా 'డార్లింగ్' అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్. తన కేరిర్ లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది. (Twitter/Photo)
ప్రస్తుతం ప్రభాస్ చిత్రం కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన కి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం కనిపించనుంది. (Twitter/Photo)
అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం 'సలార్'. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెప్పడం విశేషం. (Twitter/Photo)
వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపూ 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవ్వడం తో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది. (Project k Twitter)
ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఇటు సలార్ దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. అటు ప్రాజెక్ట్ K కూడా చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో మారుతి దర్శకత్వంలో ఓ హార్రర్ కామెడీ స్టార్ట్ చేసాడు ప్రభాస్. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఆత్మగా నటించబోతున్నట్టు సమాచారాం. Prabhas-Maruthi Twitter
గత 20 ఏళ్లు గా ప్రభాస్ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేసాడు. వరదలు వచ్చినపుడు, కోవిడ్ సమయంలోనూ ఎన్నో భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ అభివృద్ధికి కావలసిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రభాస్ మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని కోరుకుందాం. (Twitter/Photo)