Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్తో ‘భీష్మ’.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ’పుష్ప’తో వరుసగా మూడు హిట్స్ అందుకొని హాట్రిక్ సక్సెస్ అందుకుంది. (Instagram/Photo)
సినిమాకు మిగితా భాషలతో పోల్చితే హిందీలో మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్గా కూడా అన్ని భాషాల్లో భారీ హిట్ అయ్యింది. అది అలా ఉంటే ఈ సినిమాలోని శ్రీవల్లి హిందీ వీడియో సాంగ్ ఓ సంచలన రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికే ఈ పాట హిందీలో 100 మిలియన్ వ్యూస్ 2 మిలియన్ లైక్స్తో సత్తా చాటగా.. తాజాగా 24 గంటల్లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా శ్రీవల్లి హిందీ సాంగ్ నిలిచింది. (Instagram/Photo)
‘పుష్ప’ సినిమా హిందీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ అందుకోనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఈ చిత్రం 96 కోట్ల మేర వసూళ్లను అందుకోగా ఇంకొన్ని రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది హిందీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ‘పుష్ప’తో అల్లు అర్జున్తో పాటు రష్మికకు ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది. (Instagram/Photo)
Rashmika Mandanna : రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Twitter
కన్నడలో ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. Photo : Twitter
ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నారు. దాంతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్తో బాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న. Photo : Twitter
Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. Photo : Instagram
రష్మిక 2016లో 24వ స్థానం రాగా, 2017లో మొదటి స్థానం దక్కింది. ఇక రష్మిక మందన్న కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెద్దల సమక్షంలో జులై 2017లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏవో కారణాల వలన ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. ఇక రష్మిక ఎప్పటిలాగే తన సినిమాలతో సూపర్ బిజీగా మారింది. Photo : Twitter
అటు సౌత్ సినిమాల్లోనే నటిస్తూనే.. హిందీలో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ’మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కంటే టాప్ టక్కర్ ప్రైవేట్ ఆల్బమ్తో కేక పుట్టించింది. అంతేకాదు 2020లో నేపనల్ క్రష్గా నిలిచింది. అటు హిందీలో అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తోంది. ఇక శర్వానంద్తో కలిసి యాక్ట్ చేస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఈ యేడాదే విడుదల కానుంది. మరోవైపు ఇదే ఇయర్ అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ఫ 2’ రూల్ సినిమాలో మరోసారి శ్రీవల్లిగా సత్తా చూపెట్టనుంది. (Instagram/Photo)