Ram Charan: ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రామ్ చరణ్.. తన తండ్రి చిరుతో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. రామ్ చరణ్ను శాలువతో సత్కరించారు.
ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్ అమెరికా నుంచి దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. ఈసందర్భంగా నిన్న శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాను తండ్రితో చిరంజీవితో కలిసి వెళ్లాడు రామ్ చరణ్. (ANI/Photo)
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాతోొ ఎన్టీఆర్, రామ్ చరణ్ లోకల్ నుంచి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో లయ బద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్కు ఫిదా కానీ అభిమానులు లేరు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు.
ఆర్ ఆర్ ఆర్.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్లను సైతం గెలుచుకుంది. ఈ సందర్భంగా దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత అమిత్ షాను కలవడం సినీ, రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. (Twitter/Photo)