మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో పాటు రామ్ చరణ్.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పారు. మొత్తంగా రామ్ చరణ్ క్రేజీ దర్శకులను లైన్లో పెట్టి కెవ్వు కెేక పుట్టిస్తున్నారు. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాki. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. (Twitter/Photo)
కార్తితో ‘ఖైదీ’ , విజయ్తో ‘మాస్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీతో చరణ్ను ఇంప్రెస్ చేసాడట. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత లోకేష్తోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లోకేష్ కనకరాజ్.. మాత్రం మాస్టర్ తర్వాత కమల్ హాసన్తో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఉంది. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
అటు రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయడం దాదాపు ఖరారైంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు ’జెర్సీ’ హింధీ రీమేక్ చేస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్. (Twitter/Photo)
‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుములతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడట. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు వెంకీ కుడుముల మహేష్ బాబుతో పాటు వరుణ్ తేజ్తో వరుస ప్రాజెక్ట్స్ సెట్ అయినట్టు తెలుస్తోంది. (Twitter/Photo)