రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్లో ఆర్ ఆర్ ఆర్ను చూస్తున్న హలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి టేకింగ్ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు రామ్ చరణ్, ఎన్టీఆర్లకు ఓ రేంజ్లో క్రేజ్ వస్తోంది. Photo : Twitter
ఇక అది అలా అంటే రామ్ చరణ్ తన కెరీర్లోనే అతిపెద్ద బ్రాండ్పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. చరణ్ హీరో మోటో కార్ప్కు చెందిన ఒక బైక్ బ్రాండ్కు అంబాసిడర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్కు చెందిన గ్లామర్ బైక్కు ఆయన అంబాసిడర్గా ఉండనున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించన యాడ్ షూట్ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోందని తెలుస్తోంది. ఈ రెండు నిమిషాల యాడ్కు ఆయనకు ఎనిమిది కోట్ల వరకు చెల్లించిందట హీరో మోటో కార్ప్ కంపెనీ.. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ హిట్ తర్వాత మెగా పవర్స్టార్ రామ్చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఓవైపు రామ్ చరణ్ సినిమాతో పాటు శంకర్ ఇటీవలే కమల్ హాసన్తో ఇండియన్ 2 షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయని తెలిపారు శంకర్.. Photo : Twitter
అందులో భాగంగా ఈ సినిమా సెప్టెంబర్ 8 నుంచి వైజాగ్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నారని టాక్. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట టీమ్. ఈ పొలిటికల్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాలో చరణ్కి జోడీగా హిందీ భామ కియారా అద్వానీ నటిస్తున్నారు.. దిల్ రాజు నిర్మిస్తున్నారు Photo : Twitter
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసిన ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా.. మెగాభిమానులకు మాత్రం ఈ సినిమా తీపి గుర్తుగా మిగిలిపోయింది. Photo : Twitter
ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్ల కెరీర్లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్లో విడుదల కావడం ఇదే మొదటి సారి. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్న మెగాభిమానులు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తోన్నారు. Photo : Twitter
ఇక శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. Photo : Twitter
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడిచిన.. సమ్మర్కు వస్తోందని తాజా టాక్. ఇక తాజాగా ఈ సినిమా వైజాగ్లో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. Photo : Twitter
ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘అధికారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. Photo : Twitter
ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది. Photo : Twitter