Radhe Shyam | రాధే శ్యామ్ భారీ అంచనాలతో విడుదలైనా కూడా ఒక్క రికార్డు కూడా చెరిపేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో కంటే చాలా తక్కువ వసూలు చేసింది. అసలు బాహుబలితో పోలిక కూడా లేదు. అయితే ప్యాండమిక్ తర్వాత రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇక వాల్డ్ వైడ్గా షేర్ విషయానికొస్తే.. రూ. 40 కోట్ల వరకు వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
6. ప్రభాస్ ’రాధే శ్యామ్ భారీ అంచనాలతో విడుదలైనా కూడా ఒక్క రికార్డు కూడా చెరిపేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో కంటే చాలా తక్కువ వసూలు చేసింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 40 కోట్ల షేర్ వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. (Twitter/Photo)
12. భీమ్లా నాయక్: కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. ఇప్పుడు పవన్ సినిమాకు మొదటి రోజు తక్కువ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఏపీలో టికెట్ రేట్స్. ఈ కారణంగానే భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వాల్డ్ వైడ్గా ఫస్ట్ డే ఈ సినిమా 36.37 కోట్లను కొల్లగొట్టింది.
16. వినయ విధేయ రామ: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా.. పైగా బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో వినయ విధేయ రామపై అంచనాలు చాలానే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే తొలిరోజు 25.99 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఫస్ట్ డే వాల్డ్ వైడ్గా ఈ సినిమా రూ. 31.31 కోట్లను కొల్లగొట్టింది.