ఇక తాజాగా మరోసారి గోపీచంద్తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నారు. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమాతో పలకరించింది. ఈ సినిమా లాయర్ ఝాన్సీ పాత్రలో మరోసారి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పించింది. Raashi Khanna Instagram
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విషయానికొస్తే...మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్తో పాటు రాశీ ఖన్నా వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. (Twitter/Photo)
అందులో భాగంగా ఆమె వరుసగా.. ‘జిల్’, ‘జోరు’, ‘సుప్రీమ్’, ‘బెంగాల్ టైగర్’ ‘హైపర్’, ‘తొలిప్రేమ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాల్లో నటించి అదరగొట్టారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ అనే సినిమాతో పలకరించనుంది. Photo : TwitterRaashI Khanna Photo : Twitter
పక్కా కమర్షియల్ చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో ఒక వారం గ్యాప్లో పలకరిస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. Photo : Instagram
తాజాగా ఈమె అజయ్ దేవ్గణ్ మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ‘రుద్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్లో మెయిన్ లీడ్లో నటించింది. ఈ వెబ్ సిరీస్లో రాశీ ఖన్నా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో పాటు షాహిద్ కపూర్ లీడ్ రోల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది. (Instagram/Photo)
ఇక రాశీఖన్నా థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తుంది. విక్రమ్ ఆ మధ్య నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందులో రాశీ ఖన్నా చైతూ లవర్గా కాసేపు అలా తళుక్కున మెరిసింది. Photo: Instagram.com/raashikhannaoffl
ఇటీవల ప్రముఖ నటి కీర్తి సురేష్ స్వంత యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నటి రాశీఖన్నా తన సొంత ఛానెల్ను ప్రారంభించారు. ఈ విషయాన్ని రాశి ఖన్నా తన సోషల్ మీడియా ప్రొఫైల్ల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె తన ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలను, మేకప్ రహస్యాలను పంచుకున్నారు. Photo : Instagram