Rashmika Mandanna : రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Twitter
Rashmika Mandanna : రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్గా ఎంపికైంది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter Photo : Instagram
కన్నడలో ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. Photo : Twitter
ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నారు. దాంతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్తో బాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న. Photo : Twitter
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Photo : Twitter
ఇక రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. శర్వానంద్ హీరోగా చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand )ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. అయితే కొన్నేళ్లుగా శర్వానంద్కు (Sharwanand) సరైన విజయం లేదు. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు. Photo : Twitter
ఇక ఆ తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మార్చ్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించారు. Photo : Twitter
ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడన్ని ఆఫర్స్ అవి కూడా ప్యాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల నుంచి ఈ అమ్మడికి వస్తున్నాయి. మరోవైపు ఈమె ఎక్కడ కనపడ్డ మీడియా కూడా రష్మికను పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బోలెడు ఆఫర్స్ ఉన్నాయి. వచ్చిన వాటిలో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. (Instagram/Photo)Photo : Twitter
ఆడవాళ్లు మీకు జోహర్లు ప్రమోషన్లో భాగంగా వచ్చే జన్మలో తాను మగ పిల్లాడిలా పుట్టాలంటూ చెప్పి అందిరికీ ఒకింత షాక్ ఇచ్చింది. రష్మిక మందన్న ఎవరి దగ్గర మనం రక్షణగా కంఫర్ట్గా.. ఉంటామో.. ఎవరి దగ్గర మన భావాలను పంచుకుంటామో.. అలాంటి వాడే తనకు భర్తగా కావాలని చెప్పుకొచ్చింది. మొత్తంగా రష్మిక కోరికలు అందరూ ముక్కున వేలుస్తున్నారు. ఇక ఈ బామ ‘నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. Photo : Twitter
రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్తో ‘భీష్మ’.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ’పుష్ప’తో వరుసగా మూడు హిట్స్ అందుకొని హాట్రిక్ సక్సెస్ అందుకుంది. Photo : Twitter
‘పుష్ప’ సినిమా హిందీలో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ అందుకుని సంచలనం సృష్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ‘పుష్ప’తో అల్లు అర్జున్తో పాటు రష్మికకు ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది.. Photo : Twitter