విజయ్ దేవరకొండ హీరో,పూరీ జగన్నాథ్ మహేష్ బాబు జనగణమన,తెలుగు సినిమా" width="1600" height="1600" class="size-full wp-image-1250668" /> ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా కెరీర్లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తాను రిటైర్ అయ్యేలోపు ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటారు కొందరు దర్శకులు. రాజమౌళికి మహాభారతం అలాంటి ఓ కల. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా అది కేవలం మహా భారతం చేయడానికి ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తుంటాడు దర్శక ధీరుడు. అలా తెలుగులో మరో దర్శకుడికి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆయనే పూరీ జగన్నాథ్.
ఈ సెన్సేషనల్ డైరెక్టర్కు ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో కోరిక. అదే జన గణ మన. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు పూరీ. మూడేళ్ల కింద 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.
ఇస్మార్ట్ హిట్తో బ్లాక్బస్టర్ కమ్బ్యాక్ ఇచ్చినా కూడా పూరీ మాత్రం తర్వాతి సినిమా కోసం చాలా రోజుల పాటు వేచి చూసాడు. చివరికి విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్తో లైగర్ వచ్చేస్తుంది. ఆగస్ట్ 25న విడుదల కానుంది లైగర్.
విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు.. ఊహించని విధంగా మేకోవర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత పూరీ ఏం చేయబోతున్నాడనే ప్రశ్నకు సమాధానంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన పేరు వినిపిస్తుంది. ఈ కథ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు పూరీ. కానీ ఆయన చేయను అనేసరికి ఇప్పుడు ఇదే కథను చాలా మంది స్టార్ హీరోల దగ్గరికి తీసుకెళ్లాడు పూరీ.
ఆ మధ్య కన్నడ హీరో, కేజియఫ్ స్టార్ యశ్ను కూడా కలిసి కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్ లాంటి హిందీ హీరోలను కూడా ట్రై చేసాడు పూరీ జగన్నాథ్. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు హీరో దగ్గరే ఈ కథ ఆగిపోయినట్లు తెలుస్తుంది. లైగర్ హీరో విజయ్ దేవరకొండతోనే జన గణ మన పాడిస్తున్నాడు ఈయన.
లైగర్ సినిమాలో విజయ్ నటనకు.. డెడికేషన్కు ఫిదా అయిపోయిన పూరీ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్కు సరైన హీరో ఆయనే అని ఫిక్స్ అయిపోయాడు. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా #JGM అంటూ ఓ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి నిర్మాతల్లో ఒకడు కావడం గమనార్హం. కథ నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు వంశీ.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ విడుదలైంది. అందులో ఉన్న ఫోటోలు చూసి విజయ్ దేవరకొండ అభిమానులు ఫిదా అవుతున్నారు. JGM పేరుతో విడుదలైన పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.