Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటించింది. తాజాగా వైట్ డ్రెస్లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. ( Photo: Instagram/Pragya)
ఇక ఈ భామ గతేడాది హీరోయిన్గా నటించిన అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Instagram
1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్లో నటించింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది. (Instagram/Photo)
ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబిసిస్ లా స్కూల్లో చదువుకుంది. కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది. ఇక అఖండ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్లింది. ప్రగ్యాకు పెద్ద ఒరిగిందేమి లేదు. ఈ సినిమా సక్సెస్ అయినా.. అవకాశాల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. (Instagram/Photo)