పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి..చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్ పై పోకస్ చేశారు. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” ఇండియన్ లాంగ్వెజెస్లతో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదలకానుంది. ఇక ఆ తర్వాత ఆదిపురుష్, సలార్ చిత్రాలు కూడా అదే బాటలో వస్తున్నాయి. దీంతో ప్రభాస్ మూడు సినిమాలు ప్యాన్ వరల్డ్ సినిమాలుగా విడుదలకానున్నాయి. చూడాలి మరి ప్రభాస్ అక్కడ ఏమాత్రం ఆకట్టుకోనున్నారో..Photo : Twitter
ప్రభాస్ సలార్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మార్చిలోనే సలార్ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు టాక్. Photo : Twitter
అది అలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా కాదట, పాన్ వరల్డ్ సినిమా అని తెలుస్తోంది. అందులో భాగంగా ఈసినిమా ఇంగ్లీష్లో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. యాక్షన్ సిక్వెన్స్ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ను కొరియోగ్రఫి చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్గా విడుదలకానుంది. Photo : Twitter
ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. 'సలార్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వస్తున్న హార్రర్ సినిమా రాజా డీలక్స్ సినిమాకు షిప్ట్ కానున్నారు. Photo : Twitter
ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్ (పరిశీలనలో ఉన్న పేరు). మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 20 శాతం షూట్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. Photo : Twitter.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్గా శ్రీలీల, మాళవిక మోహనన్, రిద్ధి కూమార్ ఖరారు అయ్యారు. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే పేరు పరిశీలిస్తున్నారు. మారుతి (Maruthi) స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. Photo : Twitter
ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. Photo : Twitter
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కేవలం ఒక భాగమేనని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇప్పటికే దాదాపుగా 80 శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించుకుని 2024లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్... Photo : Twitter
ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter
ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush) చేస్తున్నారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. Photo : Twitter
ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికే షూట్ను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో యాక్షన్ సినిమాను చేస్తున్నారు. Photo : Twitter