ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం వరకు షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ ఖతర్నాక్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక విషయంలోకి వస్తే.. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ 70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్’లో చిత్రబృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్ డైరెక్టర్లను దించనున్నారట. Photo : Twitter
ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కెమెరాను తీసుకొచ్చారనేది తాజా టాక్. ఈ సినిమా ఓ పాంటసీ కాబట్టి ఈ కొత్త రకం టెక్నాలజీని వాడుతున్నారట. అందులో భాగంగా ‘ఆరి అలెక్సా 65’ అనే కెమెరాను వాడుతున్నారట చిత్రబృందం. మామూలుగా ఇలాంటీ కెమెరాలను హలీవుడ్ సినిమాలు ‘అవెంజర్స్’, ‘గాడ్జిల్లా’, ‘కింగ్ కాంగ్’ వంటి సినిమాలకు వాడారట. Photo : Twitter
ఈ కెమెరా ప్రత్యేకత ఏమంటే.. ఈ కెమెరాతో హై ఎండ్ మోషన్ పిక్చర్ను క్యాప్చర్ చేయోచ్చట. ఈ కెమెరాలను సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన షాట్ల కోసం మాత్రమే ఈ కెమెరా వాడతారట టీమ్. ఈ ‘ఆరి అలెక్సా 65’ కెమెరాను కొనుగోలు చేసి, ఓ సినిమా కోసం వాడుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కే నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఓ రేంజ్లో గ్రాఫిక్స్ ఉంటాయని, దీనికే సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సాయం కూడా తీసుకున్నారు నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K(Project K) దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. Photo : Twitter
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న విడుదలకానుంది. 'సలార్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. Photo : Twitter
ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush) చేస్తున్నారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. Photo : Twitter
ఇక ప్రభాస్ మరో సినిమా విషయానికి వస్తే.. ఆయన మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జానర్లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూట్ స్టార్ట్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. Photo : Twitter.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్గా శ్రీలీల, మాళవిక మోహనన్ ఖరారు అయ్యినట్లు టాక్. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే పేరు పరిశీలిస్తున్నారు. మారుతి (Maruthi) స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. Photo : Twitter
ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. Photo : Twitter