ఇక అది అలా ఉంటే పూజా హెగ్డేకు సైమా అవార్డ్స్ 2022లో రెండు అవార్డ్లు దక్కాయి. ఒకటి ఆమె అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లో నటించినందుకు బెస్ట్ యాక్టర్గా లభించింది. ఇక మరోకటి సైమా యూత్ ఐకాన్ అవార్డ్. ఇలా ఒకేసారి రెండు అవార్డ్లు రావడంతో ఈ భామ తెగ మురిసిపోతోంది. అంతేకాదు దీనికి సంబంధించి కొన్నిఫోటోలను పంచుకుంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఆమెకు ప్రస్తుతం అంత బ్యాడే జరుగుతోంది. ఈ మధ్య పూజా హెగ్డే పరిస్థితి ఏం బాగాలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. దీంతో సినిమాలను ఎంచుకోవడంలో కాస్తా ఆలోచిస్తోంది పూజా.. ఇక ఇప్పటికే వరుస సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో బాధలో ఉన్న పూజా పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయ్యింది. Photo : Instagram
అసలు విషయం ఏమంటే.. ఈ భామ భవదీయుడు భగత్ సింగ్లో హీరోయిన్గా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ సమయానికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావాల్సి ఉండేది. కాగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ను ఏం చేయాలో తెలియక ఫ్యామిలీతో వెకేషన్ కోసం వాడేసిందట. Photo : Instagram
ఇక మరోవైపు లైగర్ తర్వాత విజయ్, పూరీలు జనగణమన అనే సినిమా చేయాల్సి ఉంది. అంతేకాదు పూజా హేగ్డే ఇందులో హీరోయిన్ కావడంతో ఆమెతో ఓ షెడ్యూల్ కూడా షూట్ చేశారట, కాగా ఈ సినిమా ఏకంగా క్యాన్సల్ అయ్యిందని సమాచారం. ఇలా ఒకవైపు చేసిన సినిమాలు సరిగ్గా ఆడక, మరోవైపు ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవ్వడంతో చాలా అప్ సెట్లో ఉంది పూజా.. ఇక ఈ భామ తెలుగులో మహేష్ సరసన త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. దీంతో పాటు హిందీలో ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది. Photo : Instagram
పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్గా నిలిచిన పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్గా నిలిచిన పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్గా నిలిచిన పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పూజా హీరోయిన్గా చేసిన గత రెండు సినిమాలు సరిగా అలరించలేదు. పూాజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, రామ్ చరణ్కు జోడిగా నీలాంబరి పాత్రలో మెరిశారు. ఆచార్య సినిమా సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.. Photo : Instagram.
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Instagram
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Instagram/Photo)
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Instagram/Photo)
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్కు వెళ్లింది. Photo : Instagram
ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Twitter/Photo)
ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కథానాయికగా నటించింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 11 న విడుదలై ఓకే అనిపించింది. ‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే.ఈ సినిమాలో రామ్ చరణ్ సరనన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. (Instagram/Photo)