పవన్ ప్రస్తుతం వీరమల్లు షూటింగ్లో పాల్గోంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ చేయబోయే సినిమా ఏంటో అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చినసంగతి తెలిసిందే. పవన్ యువ దర్శకుడు సుజీత్తో ఓ సినిమాకు కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదలైంది. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ను తీసుకోవాలంటూ మేకర్స్ను అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ట్విట్టర్లో ఒకటే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఓ యాష్ ట్యాగ్ కూడా నడుపుతున్నారు. డివివి వి వాంట్ అనిరుధ్ ఫర్ ఓజి అనే ట్యాగ్తో ట్విట్టర్ ట్రెండ్ను కూడా ప్రారంభించారు. థమన్, దేవిశ్రీ తమకు వద్దని.. అనిరుధ్ రవిచందర్ కావాలంటూ రచ్చ చేస్తున్నారు. గతంలో అనిరుధ్ గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల అజ్ఞాతవాసికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి దర్శకనిర్మాతలు సంగీత దర్శకుని పట్ల ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారో.. ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. Photo : Twitter
రన్ రాజా రన్, సాహో చిత్రాలతో అదరగొట్టిన సుజీత్ పవన్ కోసం ఓ కొత్త కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య. ఇక్కడ మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా తమిళ సినిమా తెరికి రీమేక్ అని అంటున్నారు. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వార్తను చూసిన పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా పోలీసోడుగా తెలుగులో అందుబాటులో ఉంది. మరోసారి ఇలా ఎందుకు చేస్తున్నారనే వార్త ఫ్యాన్స్ను మరింత కుంగదీస్తుంది. చూడాలి మరి పవన్- సుజీత్లు తేరి సినిమానే రీమేక్ చేయనున్నారా.. లేక కొత్త కథ అనేది తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్లో కనిపించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో టీమ్ మళ్ళీ దృష్టి సారించింది. Photo : Twitter
అందులో భాగంగా ఈ చిత్రంలో ఇప్పుడు మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే సుమారు 8 నుంచి 10కోట్ల మేర మేకర్స్ ఖర్చు చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్ సినిమాలో ఓ కీలక సమయంలో రానుందని తెలుస్తోంది.. పవన్ ఇటీవల వర్క్షాప్లలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఆ మధ్య మొదలైంది. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. Photo : Twitter
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. Photo : Twitter
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుస్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం లేదని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అలాంటిదేమీ లేదని.. తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి ప్రకటించారు. Photo : Twitter
ఆయన ట్విట్టర్లో పేర్కోంటూ.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేనితో ఏజెంట్ చిత్రం చేసిన తర్వాత తమ ప్రారంభమవుతుందని నిర్మాత రామ్ ధృవీకరించారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించనున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందనుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. Photo : Twitter
ఇక ఆ సినిమాతో పాటు తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ను చేస్తున్నారు. ఈ తెలుగు రీమేక్కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్.. Photo Twitter
వినోదయసీతమ్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పవన్ మరో సినిమా గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారట. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. Photo : Twitter