యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ఆస్కార్ను గెలిచింది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ను దక్కించుకుంది.. అది అలా ఉంటే ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే చాలా గ్రాండ్గా ఉండనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న బ్లాక్ బస్టర్ ఆది సినిమా రీరిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతాజాగా విడుదలైంది. 4k క్వాలిటీలో ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్గా విడుదల చేయనున్నారట. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శతక్వం వహించగా.. నల్లమల్లపు శ్రీనివాస్ నిర్మించారు. జూ.ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా నటించారు. 2002 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచనలం సృష్టించింది. Photo : Twitter
పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వడంతో తాజాగా ఈ సినిమా టీమ్ షూట్ స్టార్ట్ చేసింది. యాక్షన్ సీన్స్తో షూట్ మొదలుకానుందట. ఈ షూట్లో జాన్వీ కూడా పాల్గోననుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వర్క్ పూర్తి అయ్యింది. షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో మరో హీరోయిన్కు కూడా అవకాశం ఉందట. Photo : Twitter
ఈ పాత్ర కోసం ఇప్పటికే అనన్య పాండే పేరు వినిపించింది. ఆ తర్వాత సాయిపల్లవి అన్నారు. ఇక చివరగా ఈ కృతి శెట్టి పేరు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఇక మూవీ రెగ్యులర్ షూట్ మార్చి 30 నుండి షురూ కానుందని టాక్. ఈ విషయంలో అతి త్వరలో టీమ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయనుంది. Photo : Twitter
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకానుంది.. యాక్షన్ సీన్స్తో షూటింగ్ను మొదలు పెట్టనున్నట్లుతెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్గా ఉండనుందట... Photo : Twitter
అలాగే ఈ చిత్రానికి భారీగా వీఎఫ్ఎక్స్ ఉంటుందని అంటున్నారు. ఇలా భారీ హంగులతో రెడీ అవుతోంది ఎన్టీఆర్ 30. దీంతో ప్రస్తుతం టీమ్ షూటింగ్ కోసం సెట్స్ను వేస్తున్నారు. అత్యంత వైభవంగా సెట్స్ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఓపెనింగ్ షెడ్యూల్ను ఇక్కడే చిత్రీకరించనున్నారట.. ఈ సెట్స్లో యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.. Photo : Twitter
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు Photo : Twitter
ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter
ఇక ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. Photo : Twitter
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారు. అయితే ఒకటి కాదు.. రెండు ఎన్టీఆర్ 31, ఎన్టీఆర్ 32. వరుసగా రెండు సినిమాలను ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ మూవీ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Photo : Twitter
ప్రశాంత్ నీల్తో పాటు ఎన్టీఆర్ ఓ సినిమాను తమిళ దర్శకుడు వెట్రీ మారన్తో ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రీ, ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారట. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట.. Photo : Twitter
ఇక మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే 20 మే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ భారీ గిఫ్ట్ను రెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి సినిమాను మే 20న 4K క్వాలిటీలో మరోసారి థియేటర్స్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎన్ని వసూళ్లను రాబట్టనుందో.. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. Photo : Twitter
సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter