ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్స్టాంట్ రెస్పాన్స్ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్తో అదరగొట్టారు.
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్లో విడుదలై ఈ పాట నెటిజన్స్ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది. ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర ఒక కోటి నుండి 1.2 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించినా.. 96 లక్షల రేంజ్ షేర్తో పరవాలేదనిపించింది. వరుడు కావలెను సినిమాను మొత్తంగా 8.6 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్గా అమ్మారు. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్లు టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా వరుడు కావలెను సినిమా ఇంకా 7.64 కోట్ల రేంజ్లో షేర్ను అందుకోవాల్సి ఉంటుంది.