ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజంగానే సుడిగాలి సుధీర్తో పాటు రష్మీ గౌతమ్ కూడా ఈటీవీకి గుడ్ బై చెప్పేస్తున్నారేమో అనే డౌట్స్ వస్తున్నాయి. పైగా కొన్ని రోజులుగా మల్లెమాల కూడా వీళ్ళను పక్కన బెడుతుందేమో అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ అంటే కేరాఫ్ జబర్దస్త్ కామెడీ షో. వీళ్ళకు అదే గుర్తింపు తీసుకొచ్చింది. అంతకుముందు సుధీర్, రష్మి అంటే ఎవరో కూడా ఎవరికీ పెద్దగా తెలియదు.
రష్మి గౌతమ్ అయినా కనీసం కొన్ని సినిమాలు చేసింది. అలా ఆమెకు కనీస గుర్తింపు ఉంది. కానీ సుధీర్ మాత్రం ఎవరికీ తెలియదు. ఓ మెజీషియన్గా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ఈయన జర్నీలో.. ఎదగడంతో అడుగడుగునా సాయం చేసింది మాత్రం మల్లెమాల ప్రొడక్షన్స్. కేవలం వాళ్ల వల్లే ఈ రోజు సుధీర్ స్టార్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మరోవైపు రష్మీ గౌతమ్ కూడా ఈ ప్రొడక్షన్ కారణంగానే ఈ రోజు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా అందుకుంటుంది. మరోవైపు మల్లెమాల ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు ఈ ఇద్దరూ. ఈ ఇద్దరూ లేకపోతే మల్లెమాల లేదేమో అనే స్థాయికి ఎదిగారు. రష్మి, సుధీర్ రెమ్యునరేషన్ పెరగడంలో మల్లెమాల పాత్ర ఎంతో ఉంది. అయితే పెట్టాలన్నా.. తిట్టాలన్నా ఇచ్చే వాడికే సాధ్యం అన్నట్లు ఇప్పుడు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ను మల్లెమాల పక్కన పెడుతుందేమో అనే అనుమానాలు ఎక్కువైపోతున్నాయి.
ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షో నుంచి సుధీర్ వెళ్లిపోతున్నాడనే రూమర్స్ ఈ మధ్యే మొదలయ్యాయి. అలాంటిదేం లేదని ఈ మధ్యే ఓ స్కిట్ చేసి క్లారిటీ ఇచ్చారు టీమ్. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఫ్యూచర్లో అది కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు రష్మీ గౌతమ్ కూడా ఈయనతో పాటే అన్నట్లుంది. తాజాగా హోళీ ఈవెంట్కు సంబంధించిన రంగ్ దే ప్రోమోలో సుధీర్, రష్మి ఇద్దరూ లేరు.
ఈటీవీలో వచ్చే ఈవెంట్లో సుధీర్, రష్మీ ఇద్దరూ లేకుండా రాకుండా చాలా రోజుల తర్వాత ఇదే తొలిసారి. దాంతో సుధీర్ ఎక్కడా.. అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాలపై విరుచుకుపడ్డారు. అక్కడ వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. సుధీర్, రష్మి మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇద్దరూ స్టార్ మాలో తేలిపోయారు. ఈ జోడీని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ స్టార్ మా తీసుకొచ్చేశారు.