మినిష్టర్ రోజా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. అక్కడ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి గతేడాదే ఆమెను వరించింది. దీంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈమె ప్రత్యర్ధులను చీల్చి చెండాడే విషయంలో ప్రభుత్వానికి గొంతు వినిపిస్తూ ఉంటూ వార్తల్లో నిలవడం రోజా స్టైల్. (Twitter/Photo)
ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి జన్మించారు. ఆ తర్వాత వీళ్ల కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయింది. రోజా వాళ్ల నాన్న సారథి స్టూడియోలో సినిమాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే పనిచేయడంతో ఈమె సినీ ఎంట్రీకి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. (File)
ఇక రోజా వాళ్ల అమ్మ కూడా నర్స్గా పనిచేసి ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు. రోజా తన విద్యాభ్యాసానికి సంబంధించిన విషయానికొస్తే.. ఆమె తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేయడం విశేషం. సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించింది.కథానాయికగా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ డైరెక్ట్ చేసారు.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో హీరో కూతురు పాత్రలో రోజా అలరించింది. ఈ సినిమా సక్సెస్తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.(file/Photo)
ఆ తర్వాత ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చిరంజీవితో చేసిన ‘ముఠామేస్త్రీ’లో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’లో రాకుమారిగా ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్కు దూసుకుపోయింది. ఆ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఆపై తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రోజా. (Twitter/Photo)
తమిళంలో రోజా .. తన భర్త సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెంబరుతి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘చామంతి’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తనను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణినే ఆమె పెళ్లాడటం విశేషం. తన ప్రేమ విషయం ముందు రోజా వాళ్లింట్లో చెప్పి అక్కడ ఒప్పుకున్న తర్వాత రోజాకు చెప్పి ఒప్పించారు.
ప్రేమ గురించి చెప్పిన పదేళ్లకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇవివి సత్యనారాయణ ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా షూటింగ్లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పారు. ఆమె ఒప్పుకుంది.. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు.. ఓ అమ్మాయి, అబ్బాయి.
ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్ను పరీక్షించుకున్నారు. అదే కోవలో రోజా కూడా తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు. అంతేకాదు చాలా మంది నటీనటులు పొలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొనసాగే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.
2014, 2019 వరుసగా రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ ఓ పారి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది. రాజకీయాల్లో ఓడిపోయినా.. ఎక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్నారు. (File)
ముందుగా మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు స్ఠానం దక్కలేదు. తాజాగా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆమె ఎట్టకేలకు మంత్రి పదవి లభించింది. ముందుగా ఆమెకు ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే.. జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు జడ్జ్గా వ్యవహిరిస్తూ ఇటు రాజకీయాలు, ఇటు టీవీ సినిమాల్లో దూసుకుపోతుంది. మంత్రి పదవి లభించిన తర్వాత జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైంది. (Twitter/Photo)
ఈ సీనియర్ నటి. 100కి పైగా సినిమాల్లో నటించి లెజెండరీ హోదా అందుకున్నారు ఈమె. ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చారు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన రోజాకు ఫేవరేట్ హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా పాత తరం హీరోలను బాగా ఇష్టపడుతుంది ఈ సీనియర్ హీరోయిన్. సీనియర్ హీరో శ్రీకాంత్ను ఈమె అన్నయ్య అని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి నటించినా కూడా.. ముందు నుంచి ఆయన్ని అన్నయ్య అనడం రోజాకు అలవాటు. రొమాన్స్ చేసే సమయంలో అన్నయ్య అంటే చిరాకు వస్తుందంటూ శ్రీకాంత్ అప్పుడప్పుడూ సరదాగా సీరియస్ అయ్యేవాడు కూడా.
శ్రీకాంత్ అంటే తనకు చాలా యిష్టం అని చాలా సార్లు చెప్పారు రోజా. అలాగే సూపర్ స్టార్ కృష్ణను కూడా చాలా అభిమానిస్తుంది రోజా. అయితే ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. కానీ ఈ తరం హీరోలలో ఎవరు రోజాకు బాగా ఇష్టం అనేది చాలా మందికి తెలియదు. ఈ తరం హీరోలలో కూడా రోజాకు ఫేవరేట్ స్టార్ ఉన్నాడు. ఆయన సినిమాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా.. తన ఫేవరేట్ హీరో సినిమాలను అస్సలు వదిలిపెట్టదు రోజా.
ఎంతో మంది కృష్ణ దగ్గరే ఆగిపోయారు కానీ ఈమెకు ఫేవరేట్ హీరో ఇప్పుడు కూడా ఒకరున్నారు. అతనెవరో కాదు.. మహేష్ బాబు. చాలా మంది అమ్మాయిల మనసులు దోచిన సూపర్ స్టార్.. రోజా మనసులోనూ ఉన్నాడు. ఈయనంటే రోజా చాలా ఇష్టం. ఈ విషయం చాలా సార్లు చెప్పింది రోజా. తనకు మహేష్ బాబు అంటే చాలా యిష్టమని.. ఆయనతో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈమె.
అతడి ఫ్యాన్ అంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటుంది రోజా. ఆ మధ్య జబర్దస్త్ ఎపిసోడ్లో ఈ విషయం గురించి ఓపెన్ అయ్యారు రోజా. హైపర్ ఆది చేసిన స్కిట్లో భాగంగా దొరబాబు ఒక్కడు స్పూఫ్ చేసాడు. అప్పుడు మహేష్ బాబు గురించి ఓపెన్ అయిపోయింది ఎమ్మెల్యే రోజా . ఆ స్కిట్లో దొరబాబు మహేష్ బాబుగా.. శాంతి స్వరూప్ భూమికగా కనిపించారు. దాంతో స్కిట్ అయిపోయిన తర్వాత రోజా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు మహేష్ బాబువా.. ఫ్యాన్ ఇక్కడ.. చంపేస్తాను ఇంకోసారి మహేష్ బాబు అంటే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రోజా.
ఇక మహేష్ బాబుతో నటించే అవకాశం వస్తే ఎలాంటి మెహమాటం లేకుండా యాక్ట్ చేస్తా నని చెబుతోంది. ప్రస్తుతం మినిస్టర్గా ఉండటంతో ఎవరు రోజా వైపు చూడటం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి సినిమాలున్నాయి. ఏదేమైనా రోజాకు మహేష్ బాబు ఫేవరేట్ హీరో అని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.