Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్జోష్లో ఉన్నారు. ‘ఆచార్య’ తర్వాత ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పిన చిరు.. తాజాగా తనతో గతంలో ఫ్లాప్ ఇచ్చిన క్రేజీ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)
ఈ లెక్కన వేదాళం రీమేక్ భోళా శంకర్ కోసం మెహర్ రమేష్ దాదాపు రూ. 2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అంటే చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది. అంతా కలిపితే రూ. 30 కోట్ల లోపే సినిమా పూర్తి కానుందని తెలుస్తుంది. అందులో చిరు పారితోషికం లేదు. (Twitter/Photo)
చిరంజీవి అటు దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది తన రిజిస్టర్ చేసుకున్న ‘గాడ్ ఫాదర్’ టైటిల్ను చిరు కోసం త్యాగం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా గోపీచంద్తో సంపత్ నంది తెరకెక్కించిన ‘సీటీమార్’ మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)
మరోవైపు దర్శకుడు వంశీ పైడిపల్లి.. చిరంజీవిని కలిసి ఓ కథను వినిపించడట. ఈ స్టోరీ విని చిరు కూడా ఇంప్రెస్ అయినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి 2019 యేడాది గాను మహర్షి సినిమాకు నేపనల్ అవార్డును అందుకున్నారు. ఇక చిరుతో చేయబోయే సినిమా కూడా మంచి సామాజిక సందేశం ఉన్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
త్రివిక్రమ్: చాలా రోజుల కిందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయింది. ‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకలోనే త్రివిక్రమ్ సినిమా ప్రకటించాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు, వెంకటేష్,ఎన్టీఆర్ సినిమాల తర్వాత చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పట్లో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి.. చిరు, పవన్లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. (Twitter/Photo)
బోయపాటి శ్రీను: మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి కూడా చిరంజీవికి కథ చెప్పారు. అయితే అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య, కళ్యాణ్ రామ్, రవితేజలతో వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి కమిటయ్యారు. ఇవి కంప్లీట్ కావాలంటే మరో మూడేళ్లు పట్టేలా ఉంది. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ‘జాంబీ రెడ్డి’తో మరో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘దటీజ్ మహాలక్ష్మి’ షూటింగ్ కంప్లీటైన విడుదల కాలేదు. ఆ సంగతి పక్కనపెడితే.. ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే ఓ చిరుకు ఓ కథను వినిపించాడట. చిరు మాత్రం ఈ స్టోరీ లైన్ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం.