అనుకున్నట్లుగానే ఆచార్య సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఆ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా చెప్పారు. అయితే నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు కొత్త విడుదల తేదీతో కనుమ రోజు మరో పోస్టర్ విడుదల చేసారు ఆచార్య టీమ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం మెగాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
మధ్యలో మాయదారి కరోనా వచ్చింది కానీ లేకపోతే ఈ సినిమా గతేడాది విడుదలయ్యేది. ఇప్పుడు ఎప్రిల్ 1 అంటూ కొత్త తేదీ కన్ఫర్మ్ చేసుకుంది ఆచార్య. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్లోనూ ఇదే విషయం చూపించారు కూడా. ఈ సినిమా కచ్చితంగా చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు.
ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది. దాంతో పాటు చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలిపోయాయి. వాటికి కూడా ప్యాకప్ చెప్పేసి.. పోస్ట్ ప్రొడక్షన్తో బిజీ అయిపోవచ్చు. అయితే కరోనా కారణంగా సినిమా ఫిబ్రవరి 4న రావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఎప్రిల్ 1న ఉగాది కానుకగా ఆచార్య విడుదల కానుంది.
ఒక్కముక్కలో చెప్పాలంటే 60 శాతం ఆచార్య షూటింగ్ ఇక్కడే ఉంటుంది. రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇందులోనే ఉండబోతుంది. అలాగే లాహే లాహే పాట ఇక్కడే చిత్రీకరించారు దర్శకుడు కొరటాల. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో భారీ ఉత్సవంలా ఈ పాటను చిత్రీకరించారు. విజువల్ ట్రీట్గా ఈ పాట ఉంటుందని అర్థమవుతుంది.
దాంతో పాటు మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ధర్మస్థలి సెట్లోనే చిత్రీకరించారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే 20 కోట్లకు పైగా ఖర్చు చేసారు. సినిమాలో చిరంజీవి పారితోషికం తర్వాత అంత ఎక్కువ ఖర్చు చేసింది ఈ సెట్ కోసమే. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరు సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పుడే రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో కనీసం రోజుకు 8 లక్షల వరకు హైయ్యస్ట్ చూస్తారని ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే సినిమాలన్నీ వాయిదా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో ఆచార్య కూడా ఉంది. అనుకున్నట్లుగానే సంక్రాంతి రోజు వాయిదా విషయం అనౌన్స్ చేసారు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఎప్రిల్ 1న ఆచార్య వస్తే బాగుంటుందని నిర్మాతలు నిర్ణయించారు.
ఈ సారి వాయిదా పడటంతో నష్టం భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాలుగేళ్లు కావొస్తుంది కొరటాల ఈ సినిమాకు కమిటై. 2018లో భరత్ అనే నేను తర్వాత ఈయన నుంచి సినిమా రాలేదు. మరోవైపు 2019లో సైరా తర్వాత చిరు కూడా సినిమా రాలేదు. అందుకే ఆచార్య సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎప్రిల్ 1న మహేష్ బాబు సర్కారు వారి పాట రానుందని చెప్పారు కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇది వాయిదా పడినట్లే కనిపిస్తుంది.
2022 ఎప్రిల్ 1న ఆచార్య విడుదల కానుంది. ఆ తర్వాత రెండు వారాల్లోనే కేజియఫ్ 2 వస్తుంది. మహేష్ బాబు సినిమా రాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కచ్చితంగా ఆచార్య టీమ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. లేదంటే ఒకేరోజు రెండు భారీ సినిమాలు పోటీ పడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు సాధ్యం కాదు. నేడో రేపో సర్కారు వారి పాట వాయిదా విషయం అధికారికంగా ప్రకటించనున్నారు.