వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఇక మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్లో హిందీ నటీ మలైకా అరోరా కనిపించనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సాంగ్ సినిమాకు మంచి అస్సెట్గా ఉంటుందని.. ఈ సాంగ్ షూట్ కోసం ఓ ప్రత్యేక సెట్ను వేస్తున్నారని తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమంటే.. చిరంజీవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. మామూలుగా చిరంజీవి ఓ సినిమాకు 45 కోట్ల దాకా తీసుకుంటారట. కానీ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా ఓవరాల్గా జరిగే బిజినెస్తో పాటు థియేట్రికల్ రన్ షేర్ మొత్తం చూసిన తర్వాత పెర్సెంటేజ్ పరంగా రెమ్యునరేషన్ను తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారట. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇలా చేయడం వల్ల మాత్రం నిర్మాతకు మంచి సాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు నెటిజన్స్. సినిమా విజయం సాధిస్తే.. హీరోకి నిర్మాతకి డబ్బులు వస్తాయి.. లేకపోతే నిర్మాత భారీగా నష్టపోయే అవకాశం ఉండదని.. ఈ పద్దతి ఉభయులకు శ్రేయష్కరం అని అంటున్నారు. Photo : Twitter
టీమ్ ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుంది. అయితే పాటలో రామ్ చరణ్ కనిపించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్ కీలకపాత్రలో కనిపించనుంది. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమిళ వేదాళం సినిమాకు రీమేక్గా వస్తున్న ఈ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Twitter
చిరంజీవి లేటెస్ట్గా నటించిన వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు చిరంజీవికెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా వసూలు చేసి వావ్ అనిపించింది. Photo : Twitter
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. ఈ సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్ను అందుకుంది.. Photo : Twitter
ఈ సినిమా దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. దీంతో ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లి్క్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రం అమెరికాలో మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఓ రేర్ ఫీట్ను కూడా సాధించింది. వాల్తేరు వీరయ్య నాన్ RRR రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి ఆదివారం అత్యధిక వసూళ్లు నమోదు చేసి రికార్డ్ సెట్ చేసింది. ఈ స్థానంలో మొదట ఆర్ ఆర్ ఆర్ ఉండగా దీని తర్వాత 3 లక్షల 55 వేల డాలర్లుకి పైగా వసూళ్లు చేసి నాన్ RRR రికార్డ్ క్రియేట్ చేసింది Photo : Twitter ..
వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించారు.. ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కేక పెట్టించారు.. తెలంగాణ యాసలో మాస్ మాహారాజా వావ్ అనిపించారు. రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నసంగతి తెలిసిందే. ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో మరో హిట్ పడింది.. Photo : Twitter
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 9 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటంచారు. రవితేజ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చిరు మరో సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ వచ్చింది. ఈసినిమా నైజాంలో 17.50 కోట్ల వాల్యూ బిజినెస్కు మొత్తంగా 12.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయాయి Photo : Twitter
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. ఆమె గతంలో చిరంజీవ సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే.. చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. Photo : Twitter
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. Photo : Twitter
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్కు హామి ఇచ్చారు. Photo : Twitter