ఆదిపురుష్ టీజర్ విడుదలైనప్పటి నుండి అటు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే కాదు సామాన్య ప్రేక్షకుల నుంచి ఓ రకమైన అసంతృప్తి ఉంది ఆదిపురుష్ సినిమా మీద. ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ ఏంటీ ఇలా ఉన్నాయని అప్ సెట్ అయ్యారు. దీంతో అభిమానులు నుండి తీవ్రమైన విమర్శలను అందుకున్నా ఆదిపురుష్ టీమ్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్ను మార్చేయనున్నారట. ఈ నేపథ్యంలో విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా జూన్ 16, 2023కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు. మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది. దీని కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. . (Twitter/Photo)
ఇది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదిపై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఎందుకంటే అటు హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్ జూన్ 2న విడుదలవుతోంది. మరోవైపు అటు హాలీవుడ్ సినిమాలు స్పెడర్ మ్యాన్ కూడా జూన్ 2న విడుదలకానుంది. జూన్ 9thన ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ వస్తోన్న మరో సినిమా వస్తోంది. ఈ రెండు 3D సినిమాలు. దీంతో ఓవర్సీస్లో మొత్తం 3D స్క్రీన్స్, ముఖ్యంగా అమెరికాలో మొత్తం 3D స్క్రీన్స్ వీటికే పోనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కలెక్షన్స్ చాలా తక్కువగా రావోచ్చని అంటున్నారు. కేవలం ఇండియాపైనే ఆధారపడాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగనుందో..
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఆదిపురుష్లో శ్రీరాముడికి మీసాలు పెట్టడం సహా ఈ సినిమాలో వానర సేనను గొరిల్లాలా చూపించడం వంటి వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మొత్తంగా ఈ సినిమాపై వస్తోన్న విభిన్న వాదనలకు జవాబు ఇచ్చేలా ఈ సినిమాను కొంచెం ఆలస్యమైన మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను పోస్ట్పోన్ చేశారు. (Twitter/Photo)
తాజాగా ప్రాజెక్ట్ K సినిమా కూడా వాయిదా పడినట్టు సమాచారం. ముందుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో కొన్ని ప్యాచెస్ వర్క్ కోసం మరో 30 రోజులు డేట్స్ కేటాయించినట్టు సమాచారం. దాంతో ఆ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ K పై పడింది. ఈ సినిమా జనవరి 2024 నుంచి 10 ఏప్రిల్ 2024కు పోస్ట్పోన్ అయినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. Project k Twitter
బాహుబలి సినిమాలతో ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ పాపులర్ అయ్యారు ప్రభాస్. ఆయన హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. మరోకీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 55 శాతం షూటింగ్ను జరుపుకుంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. Photo : Twitter
ఈ షెడ్యూల్’లో చిత్రబృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్ డైరెక్టర్లను దించనున్నారట. Photo : Twitter
ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కెమెరాను తీసుకొచ్చారనేది తాజా టాక్. ఈ సినిమా ఓ పాంటసీ కాబట్టి ఈ కొత్త రకం టెక్నాలజీని వాడుతున్నారట. అందులో భాగంగా ‘ఆరి అలెక్సా 65’ అనే కెమెరాను వాడుతున్నారట చిత్రబృందం. మామూలుగా ఇలాంటీ కెమెరాలను హలీవుడ్ సినిమాలు ‘అవెంజర్స్’, ‘గాడ్జిల్లా’, ‘కింగ్ కాంగ్’ వంటి సినిమాలకు వాడారట. Photo : Twitter
ఈ కెమెరా ప్రత్యేకత ఏమంటే.. ఈ కెమెరాతో హై ఎండ్ మోషన్ పిక్చర్ను క్యాప్చర్ చేయోచ్చట. ఈ కెమెరాలను సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన షాట్ల కోసం మాత్రమే ఈ కెమెరా వాడతారట టీమ్. ఈ ‘ఆరి అలెక్సా 65’ కెమెరాను కొనుగోలు చేసి, ఓ సినిమా కోసం వాడుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కే నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఓ రేంజ్లో గ్రాఫిక్స్ ఉంటాయని, దీనికే సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సాయం కూడా తీసుకున్నారు నాగ్ అశ్విన్. Photo : Twitter
ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K(Project K) దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ చిత్రం సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 2, 2023న విడుదలకానుంది. 'సలార్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush) చేస్తున్నారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. Photo : Twitter
ఇక మరోవైపు ప్రస్తుతం స్టార్ హీరోల బర్త్డేస్కు వారి వారి బ్లాక్ బస్టర్ సినిమాలను స్పెషల్ షోస్ వేస్తూ అదరగొడుతున్నారు ఫ్యాన్స్. ఈ హంగామాకు నాంది పలికింది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ 4k ప్రింట్తో భారీగా షోస్ వేశారు.. అంతేకాదు ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక పోకిరి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఘరానామొగుడు’ చిత్రాన్ని విడుదల చేయగా.. దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘జల్సా’ సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఇక ప్రభాస్ మరో సినిమా విషయానికి వస్తే.. ఆయన మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జానర్లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. అంతేకాదు ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట. దీంతో ఆ ఇంటికి సంబంధించిన సెట్ను టీమ్ భారీగా నిర్మింనున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. Photo : Twitter.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్గా శ్రీలీల, మాళవిక మోహనన్ ఖరారు అయ్యినట్లు టాక్. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే పేరు పరిశీలిస్తున్నారు. మారుతి (Maruthi) స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. Photo : Twitter
ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. Photo : Twitter