మహేష్ 28వ సినిమాను త్రివిక్రమ్తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే షురూ అయ్యింది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో భారీగా వేసిన ఓసెట్లో మొదలైంది. ఈ తాజా షెడ్యూల్లో హీరోయిన్స్తో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట..అది అలా ఉంటే ఈ సినిమాను మొదట ఆగస్టు 11, 2023న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్. Photo : Twitter
అయితే అనుకున్న టైమ్కు ఈ సినిమా రావడం లేదని.. షూటింగ్ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారట. ఇక అదే స్థానంలో చిరంజీవి భోళా శంకర్ సినిమా వస్తుందని ప్రకటించింది టీమ్. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా తాజాగా విడుదలైంది.. ఇక మహేష్ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. దీనికి సంబంధించి టీమ్ తాజాగా ఓ ప్రకటన కూడా చేసింది. ఈ సినిమా జనవరి 13న విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఇక గతంలో కూడా మహేష్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ కే సంక్రాంతికి వస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదలకానుంది. ఇక రామ్ చరణ్ 15 కూడా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండనుంది. ఇక ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ పరిశీలన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అమ్మకథ, ఆరంభం.. అమ్మ ఒడి.. అమరావతికి అటు ఇటు వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏదో ఒకటి ఖాయం కానుందని తెలుస్తోంది.. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఓ క్రేజీ సిస్టర్ రోల్ ఉంటుందట. ఈ సినిమా కథ మొత్తం ఓ సిస్టర్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని.. పైగా సినిమాలోనే ఈ సిస్టర్ పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట టీమ్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Mahesh and Sai Pallavi Twitter
ఈ సినిమా మామూలుగా ఆగస్టులో విడుదలకావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. సంక్రాంతి2024కి వాయిదా వేయబడిందని తెలుస్తోంది. SSMB28 బృందం జూలై నాటికి షూట్ని పూర్తి చేయలేకపోవచ్చని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 2024కి వాయిదా వేయాలని టీమ్ నిర్ణయించుకుందని లేటెస్ట్ టాక్. ఇక ఇప్పటికే సంక్రాంతిబరిలో RC15తో పాటు Project K ఉన్నాయి. చూడాలి మరి ఈ మూడు సినిమాల్లో చివరకు ఏ సినిమా సంక్రాంతికి విడుదలకానుందో.. Photo : Twitter
ఇక ఈసినిమాను మొదట స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే షూట్ ఇంకా పూర్తీ కాకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్ ఓ ప్రకటన చేసింది. Photo : Twitter
పూజా హెగ్డే తో పాటు ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్గా కనిపించనుంది. ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అయితే అదే రేంజ్లో ఈ సినిమాకు మార్కెట్ జరుగుతోందట. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. Photo : Instagram
వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter
థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట. Photo : Twitter
ఈ సినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళా అదే నిజం అయితే మొదటి మహేష్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అని అనుకోవాలి. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. ఈ మూవీలో మహేష్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. Photo : Instagram
మహేష్ బాబుతో పాటు ఈ సినిమాలో మరో యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళీ యువ హీరో రోషన్ మాథ్యూ ఎంపికైనట్లు తెలుస్తోంది. అంతేకాదు రోషన్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారట. రోషన్, ఆలియా భట్ నటించిన డార్లింగ్స్, తాజాగా విడుదలైన కోబ్రా వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. Photo : Instagram
ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. Photo : Instagram
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్ను మరోసారి టాలీవుడ్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్యాన్ వరల్డ్ సినిమాను చేయనున్నారు Photo : Instagram
రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. Photo : Twitter
ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపారు. . Photo : Twitter
మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారు. ఈ సంస్థ కాస్టింగ్తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని అంచానాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే xXx: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడంతో కొంత ప్లస్ అవుతుందని.. ఆమెను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. . Photo : Twitter
ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. . Photo : Twitter
వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారు. Photo : Twitter
ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్లో అడ్వెంచర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు. గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యారు. జేమ్స్ కామెరున్, స్పిల్ బర్గ్ వంటి వాళ్లందరు రాజమౌళి డైరెక్షన్ను మెచ్చుకున్నసంగతి తెలిసిందే . (Twitter/Photo)