Mahesh Babu - Trivikram Srinivas - SSMB 28 | ఎపుడెపుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో నందమూరి హీరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. (Twitter/Photo)
ఈ సినిమాకు సంబంధించిన బిగ్అప్టేట్ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాంతో పాటు ‘అర్జునుడు’ లేదా ‘అసుర సంధ్య వేళలో’ అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను రివీల్ చేయనున్నారు. (Twitter/Photo)
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూలై రెండో వారం నుంచి మొదలు కానుందట. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఓ ఫైట్తో షూట్ స్టార్ట్ చేస్తారట టీమ్. ఈ ఫైట్ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్లో కంపోజ్ చేయనున్నారట. మహేష్ - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (Twitter/Photo)
ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా నందమూరి హీరో తారక రత్న విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో అల వైకుంఠపురములో అక్కినేని మనవడు సుశాంత్కు ఛాన్స్ ఇచ్చినట్టే.. ఇపుడు ఎన్టీఆర్ మనవుడు తారకరత్నకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి. ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది.
త్రివిక్రమ్ సినిమా మాత్రం 2023 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, మోహన్ బాబు కలిసి నటించారు. ఒకవేళ మోహన్ బాబు ఈ సినిమాలో నటించడం కన్ఫామ్ అయితే.. దాదాపు 33 యేళ్ల తర్వాత మహేష్ బాబు, మోహన్ బాబు ఒకే తెరపై అభిమానులు చూడొచ్చు. (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాలో శోభన.. మరోసారి మోహన్ బాబు సరసన నటించబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరు.. ‘అల్లుడు గారు’, ‘రౌడీ గారి పెళ్లాం’, చివరగా ‘గేమ్’ సినిమాలో నటించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత మరోసారి వీళ్లిద్దరు వెండితెరపై జోడిగా కనిపించనున్నారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)
త్రివిక్రమ్, మహేష్ చేయబోయేది అతడు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. 2005లో వచ్చిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరి అతడు సీక్వెల్ అయితే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు.(Twitter/Photo)