సర్కారు వారి పాట తర్వాత.. మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఎపుడెపుడా ఎదురు చూస్తున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభంమై నిలిచిపోయిన విషయం తెలిసిందే. ’సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు.. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. (Twitter/Photo)
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి. ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా చేస్తున్నారు.