అది అలా ఉంటే నాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాపై స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని.. టీమ్కు విషెస్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Photo : Twitter
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన తన 28వ సినిమాను త్రివిక్రమ్తో చేస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే షురూ అయ్యింది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్. ఇక ఇప్పటికే టీమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ప్రస్తుతం దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో భారీగా వేసిన ఓసెట్లో మొదలైంది. ఈ తాజా షెడ్యూల్లో హీరోయిన్స్తో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు మహేష్తో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఓ క్రేజీ సిస్టర్ రోల్ ఉంటుందట. ఈ సినిమా కథ మొత్తం ఓ సిస్టర్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని.. పైగా సినిమాలోనే ఈ సిస్టర్ పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట టీమ్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. . Mahesh and Sai Pallavi Twitter
ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్ ఓ ప్రకటన చేసింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అయితే అదే రేంజ్లో ఈ సినిమాకు మార్కెట్ జరుగుతోందట. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. Photo : Twitter
వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter
థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట. Photo : Twitter
ఈ సినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళా అదే నిజం అయితే మొదటి మహేష్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అని అనుకోవాలి.. ఈ మూవీలో మహేష్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. Photo : Instagram
ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. Photo : Instagram
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్ను మరోసారి టాలీవుడ్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. Photo : Instagram
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28 అనే వర్కింగ్ టైటిల్తో చేస్తున్నారు. ఈ సినిమాకు ఆరంభం, అమ్మకథ, అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని టాక్ నడుస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 13న విడుదల కానున్నట్లు తాజాగా టీమ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో (SSMB29) ఓ భారీ సినిమాను చేయనున్నారు. Photo : Twitter
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కారణంగా వరల్డ్ వైడ్గా ఓ రేంజ్లో క్రేజ్ మరింతగా వస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా లాంఛింగ్కు ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ సినిమాను జూన్లో గ్రాండ్గా లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. దీపికా పడుకోనేను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు.. Photo : Twitter. Photo : Twitter
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతోంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథని రెడీ చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాని అందరి అంచనాలు మించేలా ప్లాన్ చేస్తున్నారని.. ఈ మూవీలో మెసేజ్లు వంటివి ఏమి ఉండవని, సినిమా జనరంజకంగా ఉంటూ.. ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా ఉంటుందని అన్నారు ఈ సినిమా రైటర్ విజయేంద్రప్రసాద్. అంతేకాదు ఈసారి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్లో ఒకటి కాదు.. 10- 15 నామినేషన్లు వచ్చేలా ప్లాన్ చేయాలని అన్నారు. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. Photo : Twitter
రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. Photo : Twitter
ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారు. ఈ సంస్థ కాస్టింగ్తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. Photo : Twitter
దీంతో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే xXx: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడంతో కొంత ప్లస్ అవుతుందని.. ఆమెను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. . Photo : Twitter
ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. Photo : Twitter
రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారట. Photo : Twitter