Kriti Sanon : మహేష్ బాబు వన్..నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ఢిల్లీ భామ కృతిసనన్. నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్ కు చెక్కేసి..అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక తాజాగా కృతి ప్రభాస్ ఆదిపురుష్లో సీత పాత్రలో నటించనుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన తాజాగా విడుదలైంది.. (Image: Instagram)