Kriti Sanon : మహేష్ బాబు వన్..నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్ కు చెక్కేసి..అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తోన్న‘ఆదిపురుష్’లో సీత పాత్రలో నటిస్తోంది అమ్మడు. ఇక, లేటెస్ట్ గా మిమీ అనే హిందీ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో నటించింది కృతి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి సనన్ తన అందాలతో కట్టిపడేస్తోంది.