Krithi Shetty | తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి కప్పుడు పాత నీరు పోయి.. కొత్త నీరు వస్తూ ఉంటోంది. ఈ కోవలో యువ హీరోయిన్లు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాాత నాని ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది. ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా వయ్యారాలుపోయింది. ఈ సినిమా సక్సెస్తో వరుసగా మూడు హిట్స్తో సూపర్ క్రేజ్ సంపాదించుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.
ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ పరిచమైనా.. స్ఠార్ రేంజ్ అనేది కొంది మంది మాత్రమే దక్కుతోంది. అందులో కృతి శెట్టి ముందు వరుసలో ఉంటోంది. ఇండస్ట్రీలో హీరోలకు స్టార్ ఇమేజ్ రావడానికి చాలా కాలం పడుతుంది కానీ హీరోయిన్లకు మాత్రం కాదు వరుసగా రెండు హిట్లు ఇచ్చారంటే చాలు వాళ్లు స్టార్ హీరోయిన్ అయిపోతారు ఇప్పుడు కృతి శెట్టి విషయంలో ఇదే జరుగిందనే చెప్పాలి. (Twitter/Photo)
ఈ ముద్దుగుమ్మ సాయి ధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది బేబమ్మ. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే వరకు వెళ్ళిపోయింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో బిజీగా ఉంది. (Instagram/Photo)
దానికి తోడు వరుస విజయాలు కూడా ఈమె రేంజ్ పెంచేస్తున్నాయి. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా విజయం సాధించాయి. నాని సినిమాలో బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే నాగ చైతన్య జోడీగా బంగార్రాజులో అల్లరి పాత్రతో ఆకట్టుకుంది. దాంతో మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది కృతి శెట్టి. Instagram/Photo)
కానీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ వరుస అవకాశాలను ఒడిసిపడుతోంది. (Krithi shetty Photo : Instagram)
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్ను బాగానే యూజ్ చేసుకుంటోంది. తొలి సినిమా విడుదల తర్వాత కథానాయికగా కృతి శెట్టి క్రేజ్ పీక్స్లో ఉంది. ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటనతో ఇండస్ట్రీని ఊపేయడానికి వచ్చినట్లే ఉంది. (Instagram/Photo)
తొలి సినిమా విడుదల కాకముందే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగా నాచురల్ స్టార్ నాని సరసన ’శ్యామ్ సింగరాయ్’ లో ఓ కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా విడుదలైన ఈ మూవీతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది బేబమ్మ. దాంతో పాటు రామ్ పోతినేని సినిమాతో పాటు పలు హీరోల సినిమాల్లో ఈ భామనే సెలెక్ట్ చేసారు. Photo : Instagram
దీంతో పాటు కృతి శెట్టి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్తో పాటు యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్లో ఈ భామకు అవకాశం దక్కినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది. అంతేకాదు ఇపుడు భారీ ప్రాజెక్ట్లో ఈ భామకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఏకంగా రూ. కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం. (Instagram/Photo)
ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్లో యాక్ట్ చేసేందుకు కృతి శెట్టికి ఏకంగా రూ. కోటిన్నర వరకు ఆఫర్ చేసినట్టు సమాచారం. వచ్చే యేడాది ప్రథమార్థంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కృతి శెట్టి ఇప్పటి నుంచే డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో పడిందట. త్వరలో కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తంగా ఒకేసారి తమిళం, హిందీల్లో తన లక్ పరీక్షించుకోబోతంది బేబమ్మ.(Instagram/Photo)