Kiara Advani : కియారా అద్వానీ.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే తాజా సమాచారం మేరకు కియారా మరోసారి మహేష్ సరసన మరోసారి నటించనుంది. దీనికి సంబందించి ఆమెతో చర్చలు జరపడంతో పాటు కన్ఫర్మ్ కూడా అయ్యిందని తెలుస్తుంది. సమ్మర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అది అలా ఉంటే కియారా తాజాగా బ్రైడల్ లుక్లో ఓ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్గా మారాయి.