MM Keeravani Oscar: ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు (Naatu Naatu won the Oscar) ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ సందర్భంతా అకాడమీ నుంచి ఆస్కార్ అవార్డును కీరవాణితో పాటు చంద్రబోస్ అందుకున్నారు. (Twitter/Photo)
ఓ తెలుగు చిత్రం ఆస్కార్కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి ఏ హీరోకు ఎక్కువ మ్యూజిక్ ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈయన సంగీత దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన ఆ హీరో ఎవరంటే..
Nagarjuna - Keeravani | సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కు మంచి గిరాకీ ఉంటోంది. అందులో హీరో, డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, సంగీత దర్శకుడు కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటోంది. అలాంటి కాంబినేషన్లో టాలీవుడ్లో నాగార్జున, కీరవాణిలకు మంచి స్థానం ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసింది నాగార్జునతోనే..
Nagarjuna - Keeravani: కీరవాణి తన కెరీర్లో ఎంతో మంది హీరోల సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు. అందులో అక్కినేని నాగార్జునకు సంగీతం అందించిన చిత్రాలు మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. అందులో కీరవాణి మ్యూజిక్లో నాగార్జున చేసిన చిత్రాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాలేమిటో మీరు ఓ లుక్కేయండి.
7. అన్నమయ్య | నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం అన్నమయ్య. నాగార్జున, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం. ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. అంతేకాదు అన్నమయ్య చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక సంచలన చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని నటనకు నాగార్జున జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. అటు కీరవాణి ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. (Facebook/Photo)
12. శ్రీరామదాసు | నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన 12వ చిత్రం ’శ్రీరామదాసు’. కే.రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం ‘శ్రీరామదాసు’. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే.. భక్త రామదాసు 1620- 1680 మధ్య కాలంలో 17 వ శతాబ్దానికి చెందిన వారు. మరోవైపు భక్త రామదాసుకు జ్ఞాన బోధ చేసిన కబీర్ దాస్ జీవించిన కాలం 1399-1518 ఈయన 15, 16వ శతాబ్ధానికి చెందిన వారు. ఇలా ఎపుడు కలవని వీళ్లిద్దరిని ఈ సినిమాలో చూపెట్టి.. తప్పుడు చరిత్రను రుద్దారంటూ కొంత మంది సోషల్ మీడియాలో ఈ సినిమాను తెరకెక్కించిన వాళ్లపై రుసరుస లాడారు. గతంలో నాగయ్య హీరోగా తెరకెక్కించిన చిత్రంలో కూడా ఇలానే చూపించారు. మొత్తంగా చరిత్రను వక్రీకరించి తెరకెక్కించిన శ్రీరామదాసు చిత్రం మంచి విజయాన్నే సాధించింది. (Twitter/Photo)
15. ఓం నమో వేంకటేశాయ | కే.రాఘవేంద్ర రావు, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన 15వ చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దర్శకుడు ‘హాతిరామ్ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ఆచార సంప్రదాయాలు ప్రవేశపెట్టిన అపర భక్తుడు. అంతేకాదు తిరుమల శ్రీవారే స్యయంగా ఈయనతో పాచికలు ఆట ఆడారు. గతంలో తెరకెక్కిన ‘శ్రీ వెంకటేవ్వర మహత్యం’ ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో కథ భాగంగా హాతిరామ్ బాబాజీ కథను ప్రస్తావించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. (Twitter/Photo)
నాగార్జున కీరవాణి కాంబినేషన్లో మొత్తంగా 15 చిత్రాలు తెరకెక్కితే.. అందులో సగానికి పైగా చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. కొన్ని చిత్రాలు యావరేజ్గా నిలిస్తే.. ఇంకొన్ని చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. మొత్తంగా టాలీవుడ్లో నాగార్జున, కీరవాణిది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. (File/Photo)