పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కాజల్ ప్రస్తుతం ఓ ఐదు సినిమాల్లో నటిస్తోంది. కరుంగాపియం, పారిస్ పారిస్.. క్వీన్ రీమేక్ వంటి తమిళ సినిమాలు చేస్తోంది. వీటికితోడు ఉమా అనే ఓ హిందీ సినిమా చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా ఘోస్టీ.. ఇటీవల విడుదలై డిజాస్టర్ అయ్యింది.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే కాజల్ తాజాగా రైజింగ్ ఇండియా అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో క్రమశిక్షణ, నైతిక విలువలు తక్కువా.. పుట్టి పెరిగింది ముంబైలో అయినా నా కెరీర్ ప్రారంభమైంది మాత్రం హైదరాబాద్లో.. మాతృభాష హిందీ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను.
సౌత్ ఇండస్ట్రీలో ఓ మంచి వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అక్కడ అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులు ఉన్నారు. హిందీలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సౌత్లో ఉన్న ఫ్రొఫెషనలిజం,నైతిన విలువలు హిందీ చిత్రసీమలో ఉండవంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది.
ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికి వస్తే. ఇండియన్ 2 అనే ప్యాన్ ఇండియన్ చేస్తోంది. ఇక లేటెస్ట్గా బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమా చేస్తోంది చందమామ. బాలయ్య 108 విషయానికి వస్తే.. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు ఉంటారట. దీంతో సీనియర్ బాలయ్య సరసన కాజల్ నటించనుందని వీరికి కూతురుగా శ్రీలీల కనిపించనుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ సినిమాలో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేస్తోందట. Photo : Twitter
ఆమె అడిగిన మొత్తాన్ని కూడా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి కాజల్కు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే దసరాకు విడుదలకానుంది.. Photo : Twitter
కాజల్, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2లో కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై, కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్పైకి వెళ్లినప్పటీ నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పూర్తికాకుండా పోయింది. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత.. సెట్లో ప్రమాదం జరగడం.. ఆ తర్వాత నటుడు వివేక్ మృతి, దీనికి తోడు దర్శకుడు శంకర్కు, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఇలా కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. Photo : Instagram
ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు శంకర్.. రామ్ చరణ్తో ఓ సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక ఆ సినిమా అలా ఉండగానే శంకర్ భారతీయుడు2 కూడా రెస్యూమ్ చేశారు.. ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. Photo : Instagram
చందమామ కాజల్ తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగులో అలరించారు. ఇక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆమె చిరవగా చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ఆచార్యలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేశారు. అయితే ఆమె నటించిన ఆ పార్ట్ను దర్శక నిర్మాతలు తొలగించారు. Photo : Instagram
సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు తెలుస్తోంది. కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజల్ సినిమాలతో పాటు తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్రస్తుతం తన భర్త గౌతమ్తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. Photo : Instagram
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక కాజల్ పర్సనల్ విషయానికి వస్తే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆ మధ్య తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కుమారుడికి 'నీల్ కిచ్లూ' అనే పేరు పెడుతున్నట్టు తెలిపారు కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలిపిన సంగతి తెలిసిందే. కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్లో కాజల్ అగర్వాల్ పెళ్లాడారు. Photo : Twitter
ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళైపోయినా కూడా ఇప్పటికీ కాజల్ రేంజ్ మాత్రం అలాగే ఉంది. సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ అదరహో అనిపిస్తుంది కాజల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. పెళ్లికి ముందే కండీషన్స్ అప్లై అనేసింది కాజల్ అగర్వాల్. కెరీర్కు అడ్డురాని పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పేసింది ఈమె. (Instagram/Photo)
ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్స్టాగ్రామ్లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచింది. కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ను దాటింది. దీంతో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Instagram