K Viswanath Passed Away | కే. విశ్వనాథ్ ఆయన పేరు చెబితే ఒక ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్దర్శకుడు. ఆయన కళాతపస్వి..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్. ఈ గురువారం రాత్రి (2/2/2023)న కన్నుమూసారు. ఈయన మరణంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందనే చెప్పాలి. ఈయనకు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది.
ఈ చిత్రంలో కే.విశ్వనాథ్ సీఎం పాత్రలో నటించడం విశేషం. ఈ రకంగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడమే కాకుండా.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా తీర్చిదిద్దిన ఈయనకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)