యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి నాటు నాటు పాటకు ఆస్కార్ను గెలిచింది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ను దక్కించుకుంది.. ఇక ఆయన లేటెస్ట్ సినిమా ఎన్టీఆర్ 30 ఇటీవల గ్రాండ్గా ప్రారంభం అయ్యింది. Photo : Twitter
పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వడంతో ఇక అతి త్వరలో ఈ సినిమా టీమ్ షూట్కు వెళ్లనుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వర్క్ పూర్తి అయ్యింది. షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ నటిస్తోంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ లుక్ను కూడా టీమ్ ఇటీవల విడుదల చేసింది టీమ్. Photo : Twitter
ఇక తాజాగా జాన్వీ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేసింది. ఇప్పటికే దర్శకడు కొరటాల శివకి పలుమార్లు మెసేజ్ చేసానని, రెఫరెన్స్లు ప్రిపరేటరీ షూట్స్ కోసం ఆయనని అడుగుతున్నానని అన్నారు. మూవీ షూట్ కోసం తాను రోజులు లెక్కిస్తున్నానని, ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని ప్రతిరోజు ప్రార్థించానని తెలిపారు. Photo : Twitter.
అలా ఉంటే జాన్వీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాన్వీ మామూలుగా ఒక్కో హిందీ సినిమాకు 3.5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం ఆమె 5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. దీంతో ఇంత తేడా ఎందుకని.. ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అక్కడ అలా.. తెలుగులో మాత్రం నటిస్తే.. ఇంత మొత్తం ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటూ.. ఇది ఒకరకంగా పక్షపాతం చూపించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. Photo : Twitter.
ఎన్టీఆర్ 30జాన్వీ ఫస్ట్ సౌత్ సినిమా. అయితే ఈ సినిమా కోసం జాన్వీ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. దీనికి కారణం లేకపోలేదు. ఇది ఆమె ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. దీనికి తోడు ఆర్ ఆర్ ఆర్ లాంటీ సినిమాతో గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్తో నటించడం.. అంతేకాదు కొరటాల శివ లాంటీ డైనమిక్ దర్శకుడితో పనిచేయడం ఇలా.. ఆమెకు అన్ని ఆసక్తిని కలిగించేవి. దీంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter.
ఈ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభంకావాల్సి ఉంది. అయితే తారకరత్న మరణించడంతో.. ఈ కార్యక్రామాన్ని వాయిదా వేశారు.. ఇక ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 24 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివారులో వేసిన సెట్లో మొదలు కానుందని తెలుస్తోంది. Photo : Instagram
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్గా ఖరారు అవ్వడంతో.. ఆమె మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని సమాచారం. మార్చి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది. 2024, ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. యువసుధ ఆర్ట్స్తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. Photo : Instagram
జాన్వీ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో తన బోల్డ్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఈ రేంజ్లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని.. తాను సోషల్ మీడియాను అంత సీరియస్గా తీసుకోలేదని.. అయితే అక్కడ కాస్తా బోల్డ్గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని.. ఇంకో 5 మంది తన ఫోటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్తా సులువు అవుతుందని.. అందుకే అలా చేసున్నానని తెలిపింది జాన్వీ. Photo : Instagram
ఇక అది అలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. Photo : Instagram
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram.
అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది ‘కాఫీ విత్ కరణ్’ షోలో జాన్వీ.. ఓ ప్రశ్నకు సమాధానంగా.. సోదరుడు అర్జున్కపూర్తో ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెపోటిజమ్’ అనే పేరు పెడతానంటూ ఓ కామెంట్ చేసింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్పై నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అవ్వుతున్నారు. జాన్వీ మాటలు పరోక్షంగా నెపోటిజంను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. Photo : Instagram
దీంతో జాన్వీకపూర్ చివరకు సారీ చెప్పి.. వివాదానికి ముగింపు పలికింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ ప్రస్తుతం హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉన్నారు. ఇక అది అలా ఉంటే శ్రీదేవి రెండో కూతురు ఖుషీకపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఖుషి.. జోయా అక్తర్ (Zoya Akhtar) తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ (The Archies)తో ఎంట్రీ ఇస్తున్నారు Photo : Instagram
అంతేకాదు ఈ సినిమా కోసం ఖుషి చాలా కష్టపడుతున్నారట. దీంతో తన చెల్లెలు విషయంలో ముఖ్యంగా నటన విషయంలో ఎవరైనా ట్రోల్ చేస్తే.. ఊరుకునేది లేదని అంటోంది జాన్వీ. ఆర్చీస్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా హీరోగా చేస్తున్నారు. ఇక జాన్వీకపూర్ విషయానికి వస్తే... ఆమె మెయిన్ రోల్లో నటించిన గుడ్ లక్ జెర్రీ . క్రైం కామెడీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కొలమావు కోకిలకు హిందీ రీమేక్గా వచ్చింది. Photo : Instagram Photo : Instagram
అది అలా ఉంటే జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్ హాట్ హాట్గా నడుస్తుంది..Photo : Instagram
జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. Photo : Instagram
జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు.. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో సౌత్లో నటించడానికి రెడీ అవుతోంది.(Twitter/Photo)