Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. Photo : Instagram
ఈ ప్రకటన తర్వాత సమంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు, రూమర్స్ వచ్చాయి. అన్నింటిని ఓపికగా భరిస్తూ ముందుకు సాగుతున్నారు సమంత. ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత సూపర్ బిజీగా మారారు. అందులో భాగంగా సమంత ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్ 30న విడదులై వైరల్గా మారింది. Photo : Instagram
అది అలా ఉంటే ఈ సాంగ్కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. అల్లు అర్జున్తో కలిసి సమంత వేసే స్టెప్పులు, ఆ పాట సినిమాకు హైలెట్ కానుందట. ఈ పాటకు గణేష్ ఆచార్య కోరియోగ్రఫిని అందించారని తెలుస్తోంది. ఊ అంటావా?.. ఉఉ అంటావా? అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 10న రాబోతోందని చిత్రబృందం పేర్కోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Photo : Instagram
ఇక విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్తో చేయబోతుంది.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. Photo : Instagram
ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్తో దసరా సందర్భంగా ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.. Photo : Instagram
ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.Photo : Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.Photo : Instagram
ఇక మరోవైపు సమంతకు హిందీలో పలు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్తో బాగా పాపులరైన సమంతకు అక్కడ మూడు సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ వచ్చాయని టాక్. యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు సమంతతో యష్ రాజ్ మూడు సినిమాలకు ఒప్పందం చేసుకుందని అంటున్నారు. సమంతకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. Photo : Instagram
మరోవైపు సమంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో మొదలుపెట్టబోతున్న ఓ తెలుగు సినిమాకు తన రెమ్యునరేషన్ (Samantha remuneration)ను పెంచేసిందని టాక్. ఇప్పటి నుంచి కొత్త సినిమాకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram