ఏపీ మినిష్టర్ రోజా తాజాగా చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబులపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రోజా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమెడియన్, నటుడు గెటప్ శ్రీను రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్ట్ దూమారం రేపుతోంది. శ్రీను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. Photo : Instagram
తాజాగా రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి, నాగబాబులను జనం ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని.. సినీ నటులు చాలా సెన్సిటివ్గా ఉంటారు.. అందరికీ సాయం చేస్తారు కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారని కామెంట్ చేశారు.ఈ నేపథ్యంలో రోజాకు శ్రీను కౌంటర్ ఇచ్చారు. Photo : Instagram
శ్రీను కౌంటర్ ఇస్తూ.. ‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండంటూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram
ఇక రోజా విసయానికి వస్తే.. మినిష్టర్ రోజా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. అక్కడ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి ఈ యేడాదే ఆమెను వరించింది. దీంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. (Twitter/Photo)
ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి జన్మించారు. ఆ తర్వాత వీళ్ల కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయింది. రోజా వాళ్ల నాన్న సారథి స్టూడియోలో సినిమాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే పనిచేయడంతో ఈమె సినీ ఎంట్రీకి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. (File)
ఇక రోజా వాళ్ల అమ్మ కూడా నర్స్గా పనిచేసి ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు. రోజా తన విద్యాభ్యాసానికి సంబంధించిన విషయానికొస్తే.. ఆమె తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేయడం విశేషం. సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించింది.కథానాయికగా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ డైరెక్ట్ చేసారు.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో హీరో కూతురు పాత్రలో రోజా అలరించింది. ఈ సినిమా సక్సెస్తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.(file/Photo)
ఆ తర్వాత ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చిరంజీవితో చేసిన ‘ముఠామేస్త్రీ’లో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’లో రాకుమారిగా ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్కు దూసుకుపోయింది. ఆ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఆపై తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రోజా. (Twitter/Photo)
తమిళంలో రోజా .. తన భర్త సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెంబరుతి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘చామంతి’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తనను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణినే ఆమె పెళ్లాడటం విశేషం. తన ప్రేమ విషయం ముందు రోజా వాళ్లింట్లో చెప్పి అక్కడ ఒప్పుకున్న తర్వాత రోజాకు చెప్పి ఒప్పించారు.
ప్రేమ గురించి చెప్పిన పదేళ్లకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇవివి సత్యనారాయణ ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా షూటింగ్లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పారు. ఆమె ఒప్పుకుంది.. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు.. ఓ అమ్మాయి, అబ్బాయి.
ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్ను పరీక్షించుకున్నారు. అదే కోవలో రోజా కూడా తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు. అంతేకాదు చాలా మంది నటీనటులు పొలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొనసాగే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.
2014, 2019 వరుసగా రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ ఓ పారి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది. రాజకీయాల్లో ఓడిపోయినా.. ఎక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్నారు. (File)
ముందుగా మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు స్ఠానం దక్కలేదు. తాజాగా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆమె ఎట్టకేలకు మంత్రి పదవి లభించింది. ముందుగా ఆమెకు ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే.. జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు జడ్జ్గా వ్యవహిరిస్తూ ఇటు రాజకీయాలు, ఇటు టీవీ సినిమాల్లో దూసుకుపోతుంది. మంత్రి పదవి లభించిన తర్వాత జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైంది. (Twitter/Photo)
మినిష్టర్ రోజా భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు విషయానికొస్తే.. ఆమె భర్త పేరు మీద ఎలాంటి స్థిరాస్థులు లేవు. చరాస్థి విషయానికొస్తే.. 58,02,953 ఉంది. అప్పులు రూ. 22 లక్షల దాకా అప్పులున్నాయి. దాంతో పాటు హైదరాబాద్, చిత్తూరు, చైన్నెలో కూడా సొంత ఇళ్లులున్నాయి. ఇక తల్లిదండ్రులు ఇతరులు పేర్లు మీద ఇళ్లు పొలాలున్నాయి. వాటన్నింటినీ కలిపితే దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏమైనా సినీ రంగంలో ఉంటూ దక్షిణాదిలో జయలలిత తర్వాత ఇన్ని దక్కా మొక్కీలు తిని మంత్రిగా స్థానం సంపాదించిన రోజా ముందు ముందు రాజకీయంగా ఎలాంటి ఉన్నత స్థానం పొందుతుందో చూడాలి. (Twitter/Photo)