తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో నటించిన దిశాకు టాలీవుడ్లో అంతగా క్రేజ్ రాలేదు. లోఫర్ తరువాత అమ్మడికి తెలుగులో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. దీంతో ముద్దుగుమ్మ ముంబై బాట పట్టి అక్కడ హాట్ ఫోటో షూట్లు చేసుకుంటోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లోని సినిమా కోసం దిశా పటానీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. 4 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారని సమాచారం.