Chirnajeevi - Waltair Veerayya - Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ జోష్లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోంది. సుశాంత్.. కీర్తి సురేష్ భర్త పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకు విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు. తమన్నా, కీర్తి సురేష్ సోఫాలో కూర్చొగా.. వెనకగా కొండంత అండగా ఉన్న చిరంజీవి ఫోటోతో కూడిన పోస్టర్ను విడుదల చేసారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ తాజాగా 2023 సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’తో దక్కింది. ఈ సినిమాకు చిరు ఎంత పారితోషకం తీసుకున్నాడనేది ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం రూ. 50 కోట్ల పారితోషకం అందుకున్నట్టు సమాచారం.(Twitter/Photo)
మెహర్ రమేష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. వేదాళం రీమేక్ కోసం దాదాపు ఆరేళ్లకు పైగానే వర్క్ చేసాడు మెహర్. ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కోసం చాలా రోజుల పాటు కష్టపడ్డాడు. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్కు తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసాడు మెహర్ రమేష్. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తుంటే ఈ సారి మెహర్ జాతకం మారిపోతుందనే నమ్మకం కనిపిస్తుంది. పైగా చిరు.. వాల్తేరు వీరయ్య సక్సెస్తో జోష్లో ఉన్నాడు. (Twitter/Photo)
దర్శకుడు మెహర్ రమేష్ చివరి సినిమా షాడో 2013లో విడుదలైంది. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. నిర్మాతలకు దాదాపు రూ. 20 కోట్లకు పైగానే నష్టాలు తీసుకొచ్చింది షాడో. దాంతో ఈ సినిమా తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. హీరోలైతే మెహర్ రమేష్ నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మెహర్ రమేష్ మళ్లీ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేసాడు.(Twitter/Photo)
మెహర్ రమేష్కు యాక్షన్ సీక్వెన్సులు బాగా తెరకెక్కిస్తాడనే పేరుండటంతో పెద్ద సినిమాల్లో అలాంటి సీన్స్ ఈయన చేతుల్లో పెట్టేవాళ్లు కొందరు దర్శకులు. ఇక అసిస్టెంట్గానే ఫిక్స్ అయిపోవాలేమో అనుకుంటున్న తరుణంలో ఏకంగా చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. వేదాళం సినిమాను రీమేక్ చేసే బాధ్యతను మెహర్ చేతుల్లో పెట్టాడు మెగాస్టార్. అయితే ఇక్కడే చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా కోసం మెహర్ రమేష్ ఎంత పారితోషికం అందుకుంటున్నాడా అని..?
వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అందుకోవడం లేదు మెహర్ రమేష్. ఈ సినిమా మొదలై పూర్తయ్యే వరకు నెల జీతానికి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలకు రూ. 5 లక్షల చొప్పిన ఎన్ని నెలలు సినిమా వర్క్ నడిస్తే.. అన్ని రోజులు జీతం ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 2020 సెప్టెంబర్లోనే వేదాళం రీమేక్ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. అంటే ఇప్పటికే ఈ సినిమా పేరు మీదరూ. 1కోటి 20 లక్షల జీతం అందుకోనున్నాడు మెహర్ రమేష్. పైగా చిరంజీవి చిన్నమ్మ కొడుకు కావడంతో తమ్ముడికి ఓ ఛాన్స్ ఇస్తున్నాడు చిరంజీవి. (File/Photo)
మరో ఆరు నెలలు ఈ సినిమా పని ఉంటుంది. దాంతో మరో రూ. 30 లక్షలు ఖాయం. దాంతో పాటు సినిమా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వేదాళం రీమేక్ భోళా శంకర్ కోసం మెహర్ రమేష్ దాదాపు రూ. 2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అంటే చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది.
అంతా కలిపితే రూ. 30 కోట్ల లోపే సినిమా పూర్తి కానుందని తెలుస్తుంది. అందులో చిరు పారితోషికం లేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కెఎస్ రామారావు కూడా భోళా శంకర్ నిర్మాణంలో భాగం అయ్యాడు. చిరు సూచన మేరకే ఈయన కూడా భాగం అయ్యాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక హీరోయిన్గా తమన్నా ఫిక్స్ అయింది. సైరా తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు చిరు, తమన్నా. మరి ‘భోళా శంకర్’ సినిమాతో చిరు తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)