ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా అక్కడ ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ దాటింది. ఇక మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్గా ఈ సినిమా 17.68 కోట్ల రేంజ్లో షేర్ను అందుకుంది. 32.70 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఇక రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. రెండో రోజు 9.67 కోట్ల షేర్ను, 17.65 కోట్ల గ్రాస్ను అందుకుంది. దీంతో ఈ సినిమా రెండు రోజులకు 27.35 కోట్ల షేర్ను అందుకోగా 50 కోట్ల గ్రాస్ను అందుకుంది. Photo : Twitter
ఇక ఈ సినిమా ఏడో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా 7వ రోజు 83 లక్షల రేంజ్లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్గా 1.33 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ను చూస్తే.. నైజాం 11.63 కోట్లు, సీడెడ్: 8.91 కోట్లు, ఉత్తరాంధ్ర : 5.29 కోట్లు, ఈస్ట్: 3.42 కోట్లు, వెస్ట్: 2.04 కోట్లు, గుంటూరు : 3.70 కోట్లు, కృష్ణ: 2.44 కోట్లు, నెల్లూరు : 1.87 కోట్లు...
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 39.36 కోట్ల షేర్, 64.80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక కర్నాటక 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ 4.55 కోట్లు, ఓవర్సీస్ : 4.75 కోట్లు. వరల్డ్ వైడ్గా 53.10 కోట్ల షేర్ రాగా.. 96.35 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల రేంజ్ టార్గెట్తో బరిలోకి దిగగా.. ఇంకా 38.90 కోట్ల షేర్ను అందుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. చూడాలి మరి ఫుల్ రన్లో ఎంత వసూలు చేయనుందో.. Photo : TwitterPhoto : Twitter
ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఆయన చిన్నపాత్ర చేసిన అది.. హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడని చిరంజీవి సక్సెస్ మీట్లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఓ మెగా గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెగా క్యాంప్లోని వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని చిరు, చరణ్ అనుకుంటున్నట్లు టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. భారీ ధరకు ఈసినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళ భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం అయ్యినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. Photo : Twitter
సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్రలో కనిపించారు.. లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. ఆమె గతంలో చిరంజీవ సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్తో “భోళా శంకర్” అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన పోస్టర్లో చిరంజీవి అదరగొట్టారు. స్టైలీష్ అండ్ యంగ్ లుక్లో వావ్ అనిపించారు. Photo : Twitter
వీటితో పాటు చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని లేటెస్ట్ టాక్. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. Photo : Twitter
చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకానుందని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. యూరప్లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. తదుపరి షెడ్యూల్ అక్కడే జరుగనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రిరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యూవీ విక్కీ నాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టు అన్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉండనుంది. ఎలాంటి కథతో వస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. Photo : Twitter
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్కు హామి ఇచ్చారు. Photo : Twitter
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sarath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా ప్రాజెక్ట్ సినిమానా లేక ఏదైనా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. Photo : Twitter