మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మాస్ యాక్షన్ #Mega154. బాబీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకానుందని ప్రకటించారు. కాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. యూరప్లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. తదుపరి షెడ్యూల్ అక్కడే జరుగనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రిరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యూవీ విక్కీ నాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టు అన్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉండనుంది. ఎలాంటి కథతో వస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్. Photo : Twitter
ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. Photo : Twitter
హిందీ సూపర్ స్టార్ ఓ కీలకపాత్రలో కనిపించినున్న ఈ సినిమాకు సంబంధించి హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్కు సాలిడ్ ఆఫర్ వచ్చిందట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 45 కోట్ల ఆఫర్ వచ్చిందని అంటున్నారు. హిందీకి చెందిన ప్రముఖ సంస్థతో ఈ డీల్ లాక్ అయ్యినట్టుగా టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
హిందీ సూపర్ స్టార్ ఓ కీలకపాత్రలో కనిపించినున్న ఈ సినిమాకు సంబంధించి హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్కు సాలిడ్ ఆఫర్ వచ్చిందట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 45 కోట్ల ఆఫర్ వచ్చిందని అంటున్నారు. హిందీకి చెందిన ప్రముఖ సంస్థతో ఈ డీల్ లాక్ అయ్యినట్టుగా టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఈ రెండు సినిమాలతో వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. Photo : Twitter
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. Photo : Twitter
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్కు హామి ఇచ్చారు. Photo : Twitter
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాగా ఆయన మరో ప్రాజెక్ట్ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sarath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా ప్రాజెక్ట్ సినిమానా లేక ఏదైనా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. Photo : Twitter