చిరంజీవి లేటెస్ట్గా నటించిన సినిమా గాడ్ ఫాదర్. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్లో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పటికే థియేట్రికల్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా టీవీలో కూడా ప్రసారానికి రెడీ అయ్యింది. గాడ్ ఫాదర్ జనవరి 15న జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ఓ ప్రోమోను వదిలారు. చూడాలి మరి గాడ్ ఫాదర్ అక్కడ ఎంత రేటింగ్ను రాబట్టనుందో.. Photo : Twitter
మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మోహన రాజా దర్శకత్వం చేశారు. అక్టోబర్ 5న విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది గాడ్ ఫాదర్. అయితే అనుకున్న రేంజ్లో అంటే మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఆయన చిన్నపాత్ర చేసిన అది.. హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. ఆమె గతంలో చిరంజీవ సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ను ముమ్మరం చేసింది టీమ్. అందులో భాగంగా విడుదలైన పాటలకు మంచి ఆదరణ వస్తోంది. Photo : Twitter
చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ చేస్తున్నారు. రవితేజ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు.. ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఇటీవల రవితేజకు సంబంధించిన టీజర్ విడుదలై కేక పెట్టించింది. తెలంగాణ యాసలో ఆయన వావ్ అనిపించారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో.. అది అలా ఉంటే ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ను విడుదల చేసింది టీమ్. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అవుతా' అంటూ సాగే ఈ పాట మంచి రెస్పాన్స్ను దక్కించుకుంటోంది... Photo : Twitter
ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్తో పాటు ఒకప్పటి నటి సుమలత కూడా నటించనున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
ఇక మెగాస్టార్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్తో “భోళా శంకర్” అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన పోస్టర్లో చిరంజీవి అదరగొట్టారు. స్టైలీష్ అండ్ యంగ్ లుక్లో వావ్ అనిపించారు. Photo : Twitter
చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రిరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యూవీ విక్కీ నాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టు అన్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉండనుంది. ఎలాంటి కథతో వస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter
చిరంజీవి నటించిన మరో లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.. చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. Photo : Twitter
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్కు హామి ఇచ్చారు. Photo : Twitter